చూడ్డానికి క్లాస్గా కనిపిస్తాడు కానీ.. రామ్ చేసేవి చాలా వరకు మాస్ పాత్రలే. అతడికి సరైన మాస్ క్యారెక్టర్ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ‘ఇస్మార్ట్ శంకర్’తో రుజువు చేశాడు. ఈ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్.. తర్వాత ‘రెడ్’తోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మరీ పెద్ద హిట్టయిపోకున్నా.. డీసెంట్ కలెక్షన్లతో నిర్మాత, బయ్యర్లకు మంచి ఫలితాన్నే అందించింది.
ఇప్పుడతను తమిళ సీనియర్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే షూటింగ్ మొదలు కాకముందే ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు చెబుతున్నారు. ‘ఉస్తాద్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఈ సినిమాకు పెట్టారట. ఈ వర్కింగ్ టైటిల్తోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఈ టైటిల్ను రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారం. ఇదే నిజమైతే రామ్ అభిమానులకు పండగ అన్నట్లే.
రామ్ను అభిమానులు ఉస్తాద్ అని పిలుచుకుంటారు. రామ్ పీఆర్వో టీం కూడా అతడి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటపుడు పేరు ముందు ఉస్తాద్ అనే పదం వాడుతుంటుంది. ఐతే పవర్ స్టార్ పవన్ అభిమానులు మాత్రం ‘ఉస్తాద్’ అనే పదం తమ హీరోకే నప్పుతుందని అంటుంటారు. రామ్కు ఈ టైటిల్ వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా రామ్ సినిమాకు ‘ఉస్తాద్’ అని పెట్టేశారంటే ఇక అతడికి అది శాశ్వతంగా సొంతం అయిపోయినట్లే.
సినిమా హిట్టయితే ‘ఎనర్జిటిక్ స్టార్’ అని తీసేసి ‘ఉస్తాద్’ అనే బిరుదును పర్మనెంట్ చేసేస్తారేమో. రన్, పందెం కోడి, వేట్టై లాంటి చిత్రాలతో లింగుస్వామి మంచి మాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఆయన కొన్నేళ్ల నుంచి ఫాంలో లేడు. సికిందర్, పందెంకోడి-2 చిత్రాలు డిజాస్టర్లయ్యాయి. మరి రామ్ సినిమాతో మళ్లీ మునుపటి ఫామ్ చూపిస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on July 11, 2021 10:23 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…