స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్, అలానే సల్మాన్ కి చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సభ్యులు ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు తనను సంప్రదించి ఆ సంస్థ ఫ్రాంచైజీను తెరవమని అడిగినట్లు అరుణ్ గుప్తా చెప్పారు.
దీనికోసం రెండు నుండి మూడు కోట్లు ఖర్చువుతుందని.. కావాల్సిన బ్యాకప్ మొత్తం ఏర్పాటు చేయడంతో పాటు సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొంటారని చెప్పినట్లు అరుణ్ గుప్తా తెలిపారు. వారి మాటలను నమ్మి అంత మొత్తాన్ని ఖర్చుపెట్టారట. అయితే షోరూమ్ తెరిచి సంవత్సరం గడుస్తున్నా.. ఇప్పటివరకు తనకు రావాల్సిన స్టాక్ ను పంపించలేదని తెలిపారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్ తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారని.. ఈ క్రమంలో సల్మాన్ ను కలిసినట్లు అరుణ్ గుప్తా తెలిపారు.
ఆయన షోరూమ్ ప్రారంభోత్సవానికి వస్తానని హామీ ఇచ్చారట. కానీ తరువాత సల్మాన్ రాలేదని.. ఆయనకు బదులుగా ఆయుష్ శర్మను (సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్త) పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. షోరూమ్ ప్రారంభించి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదని వాపోయాడు. ఈ మేరకు సల్మాన్ ఖాన్. ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ సంస్థ సీఈఓ ప్రకాష్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.
This post was last modified on July 9, 2021 10:13 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…