పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఆ విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగడం లేదు.
దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాదనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ నిర్మాత ఏ ఎమ్ రత్నం స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా అనుకున్న టైమ్ కి వచ్చి తీరుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ముందుగా ‘ఏకే’ రీమేక్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల దర్శకనిర్మాతలు ఒక మాట మీదకు రావడంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాను వాయిదా వేయనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన పోస్ట్ ప్రొడక్షన్ కు, వీఎఫ్ఎక్స్ కు కావాల్సినంత సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘హరిహర వీరమల్లు’ రాకపోయినా.. ‘ఏకే’ రీమేక్ మాత్రం రెడీగా ఉంటుందని తెలుస్తోంది.
This post was last modified on July 8, 2021 2:46 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…