Movie News

‘హరిహర వీరమల్లు’ ఔట్.. ‘ఏకే’ రీమేక్ ఇన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఆ విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగడం లేదు.

దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాదనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ నిర్మాత ఏ ఎమ్ రత్నం స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా అనుకున్న టైమ్ కి వచ్చి తీరుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ముందుగా ‘ఏకే’ రీమేక్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల దర్శకనిర్మాతలు ఒక మాట మీదకు రావడంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాను వాయిదా వేయనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన పోస్ట్ ప్రొడక్షన్ కు, వీఎఫ్ఎక్స్ కు కావాల్సినంత సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘హరిహర వీరమల్లు’ రాకపోయినా.. ‘ఏకే’ రీమేక్ మాత్రం రెడీగా ఉంటుందని తెలుస్తోంది.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

9 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

38 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago