భారీ చిత్రాలను పక్కన పెట్టేస్తే ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో లవ్ స్టోరి ఒకటి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో ముందే ఈ చిత్రంపై మంచి అంచనాలుండగా.. నాగచైతన్య, సాయిపల్లవి జోడీ ఆకర్షణ కూడా తోడైంది. పైగా ఈ సినిమా పాటలు, ఇతర ప్రోమోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా చూడ్డం కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ ఏప్రిల్లో ఇంకో వారంలో సినిమా రిలీజ్ అనగా కరోనా ఉద్ధృతి పెరిగి విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
ఐతే మధ్యలో ఓటీటీల నుంచి లవ్ స్టోరి కోసం ఆఫర్లు వచ్చినా నిర్మాతలు చలించలేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నైజాంలో మెజారిటీ థియేటర్లు చేతిలో ఉన్న ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించడం తెలిసిందే.
తాజాగా నారంగ్ లవ్ స్టోరి ఓటీటీ ఆఫర్ల గురించి స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా పది ఓటీటీ ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐతే తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు.
నైజాంలో టాప్ ఎగ్జిబిటర్ అయిన నారంగ్.. ఓటీటీల్లో కొత్త చిత్రాలను రిలీజ్ చేసే నిర్మాతల తీరును తీవ్రంగా తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా మారినప్పటికీ ఎగ్జిబిటర్ల వైపే ఆయన నిలుస్తున్నారు. సినిమాకు వెన్నెముక థియేటర్లే అని.. ఆ ఇండస్ట్రీ కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తిన్న నేపథ్యంలో వాటి పునరుజ్జీవం కోసం నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా కాస్త ఆగాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘లవ్ స్టోరి’ ఓటీటీ రిలీజ్ కోసం తమకు క్రేజీ ఆఫర్లు వచ్చినా చలించలేదని, ఇలాగే మిగతా నిర్మాతలూ ఆలోచించాలని నారంగ్ అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on July 8, 2021 11:57 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…