భారీ చిత్రాలను పక్కన పెట్టేస్తే ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో లవ్ స్టోరి ఒకటి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో ముందే ఈ చిత్రంపై మంచి అంచనాలుండగా.. నాగచైతన్య, సాయిపల్లవి జోడీ ఆకర్షణ కూడా తోడైంది. పైగా ఈ సినిమా పాటలు, ఇతర ప్రోమోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా చూడ్డం కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ ఏప్రిల్లో ఇంకో వారంలో సినిమా రిలీజ్ అనగా కరోనా ఉద్ధృతి పెరిగి విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
ఐతే మధ్యలో ఓటీటీల నుంచి లవ్ స్టోరి కోసం ఆఫర్లు వచ్చినా నిర్మాతలు చలించలేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నైజాంలో మెజారిటీ థియేటర్లు చేతిలో ఉన్న ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించడం తెలిసిందే.
తాజాగా నారంగ్ లవ్ స్టోరి ఓటీటీ ఆఫర్ల గురించి స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా పది ఓటీటీ ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐతే తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు.
నైజాంలో టాప్ ఎగ్జిబిటర్ అయిన నారంగ్.. ఓటీటీల్లో కొత్త చిత్రాలను రిలీజ్ చేసే నిర్మాతల తీరును తీవ్రంగా తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా మారినప్పటికీ ఎగ్జిబిటర్ల వైపే ఆయన నిలుస్తున్నారు. సినిమాకు వెన్నెముక థియేటర్లే అని.. ఆ ఇండస్ట్రీ కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తిన్న నేపథ్యంలో వాటి పునరుజ్జీవం కోసం నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా కాస్త ఆగాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘లవ్ స్టోరి’ ఓటీటీ రిలీజ్ కోసం తమకు క్రేజీ ఆఫర్లు వచ్చినా చలించలేదని, ఇలాగే మిగతా నిర్మాతలూ ఆలోచించాలని నారంగ్ అభిప్రాయపడుతున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…