Movie News

మహేష్-రాజమౌళి.. ఆ బ్యాక్‌డ్రాప్ నిజమే


మహేష్ బాబు చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలిం వచ్చే ఏడాది మొదలు కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో జట్టు కట్టబోతున్నాడు మహేష్. జక్కన్నతో పని చేయాలని మహేష్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నాడు. పదేళ్ల కిందటే వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ అనివార్య కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌తో తన సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎప్పట్నుంచో కమిట్మెంట్ ఉన్న సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మాణంలో జక్కన్న ఈ చిత్రం చేయబోతున్నాడు.

ఐతే మహేష్-రాజమౌళి సినిమా కథ నేపథ్యం గురించి కొన్ని నెలల ముందే ఓ ఆసక్తికర ప్రచారం జరిగింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే నిర్మాత నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్‌ ఏంటో తనకు కూడా తెలియదని, మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. దీంతో ఈ ప్రచారానికి తెరపడింది. కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళి తండ్రి, ఈ చిత్రానికి కథ రాస్తున్న విజయేంద్ర ప్రసాదే ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్ గురించి మాట్లాడటం విశేషం.

మహేష్‌తో రాజమౌళి చేయాల్సిన సినిమాకు కథ ఇంకా సిద్ధం కాలేదని.. కథా చర్చలు నడుస్తున్నాయని విజయేంద్ర ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐతే రెండు రకాల కథల మీద పని చేస్తున్నామని.. అందులో ఒక కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడిచేదే అని విజయేంద్ర చెప్పడం విశేషం. త్వరలో కథపై ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లు చేసే మహేష్‌ను రాజమౌళి సినిమాలో కొంచెం రఫ్‌గా చూడాలని, జక్కన్న స్టయిల్లోనే వయొలెంట్‌గా కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యం తీసుకుంటే మహేష్‌కు కచ్చితంగా ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on July 6, 2021 6:38 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

33 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago