మనోజ్ బాజ్పేయి పేరెత్తితే ఇప్పుడందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్’ గుర్తుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్తో అతడికెంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సిరీస్ ఇది. ఇందులో శ్రీకాంత్ తివారిగా మనోజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సిరీస్ కంటే ముందు మనోజ్కు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది, నటుడిగా అతనేంటో చాటిచెప్పింది ‘సత్య’ సినిమాలోని బీకూ మాత్రే పాత్ర.
90ల చివర్లో వచ్చిన ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఆ చిత్రంలో ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేసినా.. మనోజ్ నటన మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ సినిమాతో రాత్రికి రాత్రి మనోజ్ జీవితం మారిపోయింది. ఇక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. బీకూ మాత్రే పాత్రకు అతను జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా అందుకోవడం విశేషం.
ఐతే ‘సత్య’లో నటించడానికి ముందు మనోజ్ చాలా కష్టాలే పడ్డాడట. చిన్న పాత్ర ఇచ్చినా చాలని దర్శకుల వెనుక తిరిగేవాడట. ‘స్వాభిమాన్’ సీరియల్తో కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘దౌడ్’ సినిమాలో చిన్న పాత్ర ఆఫర్ చేశాడని.. ఆ పాత్ర కోసం వెళ్లినపుడు తాను నటించిన సినిమాల గురించి అడిగాడని.. శేఖర్ కపూర్ దర్శకత్వంలో ‘బండిట్ క్వీన్’లో నటించానని చెప్పగా.. అందులో బందిపోటు మాన్ సింగ్ పాత్ర చేసింది తానే అని తెలుసుకుని.. “నీకు ఇంత చిన్న పాత్ర కరెక్ట్ కాదు. వేరే పాత్ర ఇస్తా” అని వర్మ అంటే.. ‘దౌడ్’లో నటించకపోతే పాతికవేలు పారితోషకం పోతుందంటూ వర్మ దగ్గర బాధ పడ్డానని.. దీంతో వర్మ గట్టిగా నవ్వేసి ఆ పాత్రలో నటింపజేశాడని.. తర్వాత హామీ ఇచ్చినట్లే ‘సత్య’లో బీకూ మాత్రే క్యారెక్టర్ చేయించాడని.. ఆ పాత్రతో తన దశ తిరిగిందని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత ఓ థియేటర్కు వెళ్తే జనాలు తన చుట్టూ పెద్ద ఎత్తున మూగడంతో ఊపిరాడలేదని.. సెక్యూరిటీ వాళ్లు తనను చేతులపైకి ఎత్తుకుని మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చిందని.. ఆ దృశ్యం చూసి తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని మనోజ్ చెప్పుకొచ్చాడు.
This post was last modified on July 4, 2021 2:48 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…