మనోజ్ బాజ్పేయి పేరెత్తితే ఇప్పుడందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్’ గుర్తుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్తో అతడికెంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సిరీస్ ఇది. ఇందులో శ్రీకాంత్ తివారిగా మనోజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సిరీస్ కంటే ముందు మనోజ్కు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది, నటుడిగా అతనేంటో చాటిచెప్పింది ‘సత్య’ సినిమాలోని బీకూ మాత్రే పాత్ర.
90ల చివర్లో వచ్చిన ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఆ చిత్రంలో ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేసినా.. మనోజ్ నటన మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ సినిమాతో రాత్రికి రాత్రి మనోజ్ జీవితం మారిపోయింది. ఇక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. బీకూ మాత్రే పాత్రకు అతను జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా అందుకోవడం విశేషం.
ఐతే ‘సత్య’లో నటించడానికి ముందు మనోజ్ చాలా కష్టాలే పడ్డాడట. చిన్న పాత్ర ఇచ్చినా చాలని దర్శకుల వెనుక తిరిగేవాడట. ‘స్వాభిమాన్’ సీరియల్తో కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘దౌడ్’ సినిమాలో చిన్న పాత్ర ఆఫర్ చేశాడని.. ఆ పాత్ర కోసం వెళ్లినపుడు తాను నటించిన సినిమాల గురించి అడిగాడని.. శేఖర్ కపూర్ దర్శకత్వంలో ‘బండిట్ క్వీన్’లో నటించానని చెప్పగా.. అందులో బందిపోటు మాన్ సింగ్ పాత్ర చేసింది తానే అని తెలుసుకుని.. “నీకు ఇంత చిన్న పాత్ర కరెక్ట్ కాదు. వేరే పాత్ర ఇస్తా” అని వర్మ అంటే.. ‘దౌడ్’లో నటించకపోతే పాతికవేలు పారితోషకం పోతుందంటూ వర్మ దగ్గర బాధ పడ్డానని.. దీంతో వర్మ గట్టిగా నవ్వేసి ఆ పాత్రలో నటింపజేశాడని.. తర్వాత హామీ ఇచ్చినట్లే ‘సత్య’లో బీకూ మాత్రే క్యారెక్టర్ చేయించాడని.. ఆ పాత్రతో తన దశ తిరిగిందని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత ఓ థియేటర్కు వెళ్తే జనాలు తన చుట్టూ పెద్ద ఎత్తున మూగడంతో ఊపిరాడలేదని.. సెక్యూరిటీ వాళ్లు తనను చేతులపైకి ఎత్తుకుని మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చిందని.. ఆ దృశ్యం చూసి తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని మనోజ్ చెప్పుకొచ్చాడు.
This post was last modified on July 4, 2021 2:48 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…