మనోజ్ బాజ్పేయి పేరెత్తితే ఇప్పుడందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్’ గుర్తుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్తో అతడికెంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సిరీస్ ఇది. ఇందులో శ్రీకాంత్ తివారిగా మనోజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సిరీస్ కంటే ముందు మనోజ్కు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది, నటుడిగా అతనేంటో చాటిచెప్పింది ‘సత్య’ సినిమాలోని బీకూ మాత్రే పాత్ర.
90ల చివర్లో వచ్చిన ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఆ చిత్రంలో ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేసినా.. మనోజ్ నటన మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ సినిమాతో రాత్రికి రాత్రి మనోజ్ జీవితం మారిపోయింది. ఇక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. బీకూ మాత్రే పాత్రకు అతను జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా అందుకోవడం విశేషం.
ఐతే ‘సత్య’లో నటించడానికి ముందు మనోజ్ చాలా కష్టాలే పడ్డాడట. చిన్న పాత్ర ఇచ్చినా చాలని దర్శకుల వెనుక తిరిగేవాడట. ‘స్వాభిమాన్’ సీరియల్తో కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘దౌడ్’ సినిమాలో చిన్న పాత్ర ఆఫర్ చేశాడని.. ఆ పాత్ర కోసం వెళ్లినపుడు తాను నటించిన సినిమాల గురించి అడిగాడని.. శేఖర్ కపూర్ దర్శకత్వంలో ‘బండిట్ క్వీన్’లో నటించానని చెప్పగా.. అందులో బందిపోటు మాన్ సింగ్ పాత్ర చేసింది తానే అని తెలుసుకుని.. “నీకు ఇంత చిన్న పాత్ర కరెక్ట్ కాదు. వేరే పాత్ర ఇస్తా” అని వర్మ అంటే.. ‘దౌడ్’లో నటించకపోతే పాతికవేలు పారితోషకం పోతుందంటూ వర్మ దగ్గర బాధ పడ్డానని.. దీంతో వర్మ గట్టిగా నవ్వేసి ఆ పాత్రలో నటింపజేశాడని.. తర్వాత హామీ ఇచ్చినట్లే ‘సత్య’లో బీకూ మాత్రే క్యారెక్టర్ చేయించాడని.. ఆ పాత్రతో తన దశ తిరిగిందని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత ఓ థియేటర్కు వెళ్తే జనాలు తన చుట్టూ పెద్ద ఎత్తున మూగడంతో ఊపిరాడలేదని.. సెక్యూరిటీ వాళ్లు తనను చేతులపైకి ఎత్తుకుని మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చిందని.. ఆ దృశ్యం చూసి తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని మనోజ్ చెప్పుకొచ్చాడు.
This post was last modified on July 4, 2021 2:48 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…