సౌత్ ఇండియాలో హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమంది. వారిలో అనుష్క ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సరసన భారీ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి చిత్రాలు ఆమె సత్తాను చాటి చెప్పాయి. ఐతే గత కొన్నేళ్లలో అనుష్క మరీ సెలక్టివ్గా, తక్కువగా సినిమాలు చేస్తోంది.
‘బాహుబలి’ తర్వాత ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటి మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చింది. గత ఏడాది ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క పేరే వినిపించలేదు. ఆమె కొత్త చిత్రాన్ని ఖరారు చేయడానికి చాలా టైం తీసుకుంది. ఎట్టకేలకు తన మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లో ఓ సినిమా మొదలు పెట్టడానికి ఆమె సిద్ధమైంది. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలకపాత్ర చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
అనుష్క-నవీన్ కలయిక కచ్చితంగా ఆసక్తి రేకెత్తించేదే. కాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుందట. ఇందులో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడట. దాని నిడివి తక్కువే ఉంటుందట కానీ.. స్పెషల్గా ఉంటుందని అంటున్నారు. ఇంతకుముందు ‘మహానటి’లో విజయ్ చేసిన పాత్ర ఎలా హైలైట్ అయిందో తెలిసిందే. ఈ మధ్యే ‘జాతిరత్నాలు’లోనూ అతను కొన్ని క్షణాల పాటు మెరిశాడు.
మరి అనుష్క-నవీన్ సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్తో అనుష్క అనుబంధం గురించి తెలిసిందే. ఆ సంస్థ తొలి చిత్రం ‘మిర్చి’లో ఆమే హీరోయిన్. ప్రభాస్ లాగే ఆమె కూడా ఈ సంస్థను హోం బేనర్ లాగా ఫీలవుతుంది. ఇదే సంస్థలో ఆమె నటించిన ‘భాగమతి’ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఇదే అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 4, 2021 12:28 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…