సౌత్ ఇండియాలో హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమంది. వారిలో అనుష్క ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సరసన భారీ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి చిత్రాలు ఆమె సత్తాను చాటి చెప్పాయి. ఐతే గత కొన్నేళ్లలో అనుష్క మరీ సెలక్టివ్గా, తక్కువగా సినిమాలు చేస్తోంది.
‘బాహుబలి’ తర్వాత ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటి మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చింది. గత ఏడాది ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క పేరే వినిపించలేదు. ఆమె కొత్త చిత్రాన్ని ఖరారు చేయడానికి చాలా టైం తీసుకుంది. ఎట్టకేలకు తన మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లో ఓ సినిమా మొదలు పెట్టడానికి ఆమె సిద్ధమైంది. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలకపాత్ర చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
అనుష్క-నవీన్ కలయిక కచ్చితంగా ఆసక్తి రేకెత్తించేదే. కాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుందట. ఇందులో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడట. దాని నిడివి తక్కువే ఉంటుందట కానీ.. స్పెషల్గా ఉంటుందని అంటున్నారు. ఇంతకుముందు ‘మహానటి’లో విజయ్ చేసిన పాత్ర ఎలా హైలైట్ అయిందో తెలిసిందే. ఈ మధ్యే ‘జాతిరత్నాలు’లోనూ అతను కొన్ని క్షణాల పాటు మెరిశాడు.
మరి అనుష్క-నవీన్ సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్తో అనుష్క అనుబంధం గురించి తెలిసిందే. ఆ సంస్థ తొలి చిత్రం ‘మిర్చి’లో ఆమే హీరోయిన్. ప్రభాస్ లాగే ఆమె కూడా ఈ సంస్థను హోం బేనర్ లాగా ఫీలవుతుంది. ఇదే సంస్థలో ఆమె నటించిన ‘భాగమతి’ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఇదే అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 4, 2021 12:28 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…