సౌత్ ఇండియాలో హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమంది. వారిలో అనుష్క ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సరసన భారీ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి చిత్రాలు ఆమె సత్తాను చాటి చెప్పాయి. ఐతే గత కొన్నేళ్లలో అనుష్క మరీ సెలక్టివ్గా, తక్కువగా సినిమాలు చేస్తోంది.
‘బాహుబలి’ తర్వాత ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటి మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చింది. గత ఏడాది ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క పేరే వినిపించలేదు. ఆమె కొత్త చిత్రాన్ని ఖరారు చేయడానికి చాలా టైం తీసుకుంది. ఎట్టకేలకు తన మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లో ఓ సినిమా మొదలు పెట్టడానికి ఆమె సిద్ధమైంది. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలకపాత్ర చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
అనుష్క-నవీన్ కలయిక కచ్చితంగా ఆసక్తి రేకెత్తించేదే. కాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుందట. ఇందులో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడట. దాని నిడివి తక్కువే ఉంటుందట కానీ.. స్పెషల్గా ఉంటుందని అంటున్నారు. ఇంతకుముందు ‘మహానటి’లో విజయ్ చేసిన పాత్ర ఎలా హైలైట్ అయిందో తెలిసిందే. ఈ మధ్యే ‘జాతిరత్నాలు’లోనూ అతను కొన్ని క్షణాల పాటు మెరిశాడు.
మరి అనుష్క-నవీన్ సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్తో అనుష్క అనుబంధం గురించి తెలిసిందే. ఆ సంస్థ తొలి చిత్రం ‘మిర్చి’లో ఆమే హీరోయిన్. ప్రభాస్ లాగే ఆమె కూడా ఈ సంస్థను హోం బేనర్ లాగా ఫీలవుతుంది. ఇదే సంస్థలో ఆమె నటించిన ‘భాగమతి’ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఇదే అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 4, 2021 12:28 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…