వైఎస్ఆర్ బయోపిక్ ఆధారంగా గతంలో ‘యాత్ర’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ఆర్ పాత్రలో ఆయన ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు మహి వి రాఘవ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ గా సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు.
జగన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ముందుగా ‘రంగం’ ఫేమ్ నటుడు అజ్మల్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మహి వి రాఘవ్ మాత్రం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ‘స్కామ్ 1992’లో నటించిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. ప్రతీక్ లో జగన్ పోలికలు ఉన్నాయని.. అతడి రాకతో ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన్నే ఫైనల్ చేయబోతున్నారు.
వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ‘యాత్ర 2’ మొదలవుతుంది. ఆ సమయంలో జగన్ ఎలా ఉండేవారు..? తండ్రి మరణం తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? ఓ రాజకీయనాయకుడిగా ప్రజలకు ఎలా మెప్పించగలిగాడనే విషయాలతో ‘యాత్ర 2’ని తెరకెక్కించబోతున్నారు. మరి ఇందులో జగన్ అక్రమాస్తుల కేసుల గురించి కూడా చూపిస్తారేమో చూడాలి!
This post was last modified on July 2, 2021 10:41 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…