కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్లో కొత్త సినిమాల సందడి మొదలవబోతోంది. థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పట్టేలా ఉండటంతో కొత్త చిత్రాలను ఓటీటీ బాట పట్టించే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే అగ్ర నిర్మాత సురేష్ బాబు తన ప్రొడక్షన్లో తెరకెక్కిన మూడు చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అందులో విరాట పర్వం సంగతే కొంచెం అనుమానంగా ఉంది కానీ.. నారప్ప, దృశ్యం-2 చిత్రాలు మాత్రం ఓటీటీ బాట పట్టడం పక్కా. ఇందులో ముందుగా నారప్ప ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. ఈ చిత్రాన్ని జులై 24న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
నారప్ప చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. పెట్టుబడి మీద మంచి లాభానికే ఈ సినిమాను ప్రైమ్ వాళ్లకు అమ్మినట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. నారప్ప ఒరిజినల్ అసురన్ అమేజాన్ ప్రైమ్లోనే ఏడాదిన్నరగా అందుబాటులో ఉంది. ఇప్పుడు రీమేక్ను కూడా అదే ఓటీటీ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటించింది.
త్వరలోనే నారప్ప ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించనున్నారని, రిలీజ్ డేట్ కూడా వెల్లడించనున్నారని సమాచారం. మరోవైపు దృశ్యం-2 చిత్రాన్ని హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నారప్ప వచ్చిన నెల రోజుల గ్యాప్లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. విరాటపర్వం ఓటీటీ రిలీజ్ విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయని.. త్వరలోనే స్పష్టత వస్తుందని అంటున్నారు.
This post was last modified on June 30, 2021 11:05 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…