రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయింది. అజయ్ దేవగన్ తో రెండు సినిమాలు చేస్తోన్న రకుల్ తాజాగా మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న కొత్త సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. నిజానికి ముందుగా కియారా అద్వానీ లేదా శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ ఛాన్స్ రకుల్ కి వెళ్లిందని తెలుస్తోంది.
అజయ్ దేవగన్ తో రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో అక్షయ్ పక్కన కూడా ఆమె సూట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ‘బెల్ బాటమ్’ దర్శకుడు రంజిత్ తివారి తెరకెక్కించనున్న ఈ సినిమాను నలభై రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. రకుల్ కూడా వారు అడిగిన కాల్షీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఇదే గనుక నిజమైతే బాలీవుడ్ లో రకుల్ కి డిమాండ్ పెరగడం ఖాయం.
కానీ వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీకి యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి. ఇక తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసింది రకుల్. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…