Movie News

నితిన్ లాట‌రీ కొట్టిన‌ట్లే


యువ క‌థానాయ‌కుడు నితిన్ కొత్త చిత్రం మాస్ట్రో థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వాళ్లు కొనేశారు. డీల్ ముగిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఆగ‌స్టులో మాస్ట్రోకు ప్రిమియ‌ర్స్ ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు ఎంత రేటు ప‌లికింద‌న్న దానిపై అంద‌రూ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ మొత్తం రూ.32 కోట్ల‌ని స‌మాచారం. కొన్ని నెలల ముందు వ‌ర‌కు అయితే నితిన్ సినిమా మీద ఇంత రేటు పెట్ట‌డం క‌రెక్టే అనిపించొచ్చు. కానీ ఇప్పుడున్న అత‌డి మార్కెట్ ప్ర‌కారం చూస్తే ఈ రేటు ఎక్కువే.

ఎందుకంటే గ‌త ఏడాది భీష్మ‌తో పెద్ద హిట్టు కొట్టి ఊపు మీదున్న నితిన్.. కొత్త ఏడాదిలో చెక్, రంగ్ దె లాంటి ప‌రాజ‌యాలు ఎదుర్కొన్నాడు. దీంతో అత‌డి మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మాస్ట్రోను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఏమాత్రం ఆడుతుందో అన్న డౌట్లున్నాయి. ఎందుకంటే ఇది రీమేక్. పైగా థియేట‌ర్లు ఎప్ప‌టికి తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా సినిమాలు మునుప‌టిలా ఎప్ప‌టికి ఆడ‌తాయో తెలియ‌దు. పైగా నితిన్ రెండు వ‌రుస ఫ్లాపుల మీదున్నాడు. ఇలాంటి టైంలో మాస్ట్రో మూవీకి రూ.32 కోట్ల రేటు ప‌ల‌క‌డం అంటే నితిన్ జాక్ పాట్ కొట్టిన‌ట్లే.

ఒక‌వేళ శాటిలైట్ రైట్స్ అట్టిపెట్టుకుని ఉంటే మాత్రం మ‌రింత ప్ర‌యోజ‌నం పొందనున్న‌ట్లే. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ చిత్రం హిందీ హిట్ అంధాదున్ ఆధారంగా తెర‌కెక్కింది.

Satya

Recent Posts

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

8 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

35 minutes ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

38 minutes ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

1 hour ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

11 hours ago