యువ కథానాయకుడు నితిన్ కొత్త చిత్రం మాస్ట్రో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వాళ్లు కొనేశారు. డీల్ ముగిసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆగస్టులో మాస్ట్రోకు ప్రిమియర్స్ పడతాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు ఎంత రేటు పలికిందన్న దానిపై అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆ మొత్తం రూ.32 కోట్లని సమాచారం. కొన్ని నెలల ముందు వరకు అయితే నితిన్ సినిమా మీద ఇంత రేటు పెట్టడం కరెక్టే అనిపించొచ్చు. కానీ ఇప్పుడున్న అతడి మార్కెట్ ప్రకారం చూస్తే ఈ రేటు ఎక్కువే.
ఎందుకంటే గత ఏడాది భీష్మతో పెద్ద హిట్టు కొట్టి ఊపు మీదున్న నితిన్.. కొత్త ఏడాదిలో చెక్, రంగ్ దె లాంటి పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీంతో అతడి మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్ట్రోను థియేటర్లలో రిలీజ్ చేస్తే ఏమాత్రం ఆడుతుందో అన్న డౌట్లున్నాయి. ఎందుకంటే ఇది రీమేక్. పైగా థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా సినిమాలు మునుపటిలా ఎప్పటికి ఆడతాయో తెలియదు. పైగా నితిన్ రెండు వరుస ఫ్లాపుల మీదున్నాడు. ఇలాంటి టైంలో మాస్ట్రో మూవీకి రూ.32 కోట్ల రేటు పలకడం అంటే నితిన్ జాక్ పాట్ కొట్టినట్లే.
ఒకవేళ శాటిలైట్ రైట్స్ అట్టిపెట్టుకుని ఉంటే మాత్రం మరింత ప్రయోజనం పొందనున్నట్లే. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రం హిందీ హిట్ అంధాదున్ ఆధారంగా తెరకెక్కింది.
This post was last modified on June 29, 2021 11:24 am
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…