Movie News

నితిన్ లాట‌రీ కొట్టిన‌ట్లే


యువ క‌థానాయ‌కుడు నితిన్ కొత్త చిత్రం మాస్ట్రో థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వాళ్లు కొనేశారు. డీల్ ముగిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఆగ‌స్టులో మాస్ట్రోకు ప్రిమియ‌ర్స్ ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు ఎంత రేటు ప‌లికింద‌న్న దానిపై అంద‌రూ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ మొత్తం రూ.32 కోట్ల‌ని స‌మాచారం. కొన్ని నెలల ముందు వ‌ర‌కు అయితే నితిన్ సినిమా మీద ఇంత రేటు పెట్ట‌డం క‌రెక్టే అనిపించొచ్చు. కానీ ఇప్పుడున్న అత‌డి మార్కెట్ ప్ర‌కారం చూస్తే ఈ రేటు ఎక్కువే.

ఎందుకంటే గ‌త ఏడాది భీష్మ‌తో పెద్ద హిట్టు కొట్టి ఊపు మీదున్న నితిన్.. కొత్త ఏడాదిలో చెక్, రంగ్ దె లాంటి ప‌రాజ‌యాలు ఎదుర్కొన్నాడు. దీంతో అత‌డి మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మాస్ట్రోను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఏమాత్రం ఆడుతుందో అన్న డౌట్లున్నాయి. ఎందుకంటే ఇది రీమేక్. పైగా థియేట‌ర్లు ఎప్ప‌టికి తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా సినిమాలు మునుప‌టిలా ఎప్ప‌టికి ఆడ‌తాయో తెలియ‌దు. పైగా నితిన్ రెండు వ‌రుస ఫ్లాపుల మీదున్నాడు. ఇలాంటి టైంలో మాస్ట్రో మూవీకి రూ.32 కోట్ల రేటు ప‌ల‌క‌డం అంటే నితిన్ జాక్ పాట్ కొట్టిన‌ట్లే.

ఒక‌వేళ శాటిలైట్ రైట్స్ అట్టిపెట్టుకుని ఉంటే మాత్రం మ‌రింత ప్ర‌యోజ‌నం పొందనున్న‌ట్లే. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ చిత్రం హిందీ హిట్ అంధాదున్ ఆధారంగా తెర‌కెక్కింది.

This post was last modified on June 29, 2021 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

4 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

11 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

11 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

11 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

13 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

14 hours ago