‘నాగిని 3’ ఫేమ్ పరల్ వి పూరిను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ బాలికను కిడ్నాప్ చేసి కారులో లైంగిక దాడి చేశాడని.. పలుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పరల్ తో పాటు అతడి స్నేహితులపై కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పలువురు బుల్లితెర నటులు, నిర్మాత ఏక్తా కపూర్.. పరల్ వి పూరికి మద్దతుగా నిలిచారు.
రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చిన పరల్ దాదాపు రెండు వారాల తరువాత మొదటిసారి ఈ కేసుపై నోరు విప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. కాలం మనుషులను ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటుందని అన్నారు. ఇటీవల తన నాన్నమ్మను కోల్పోయానని.. ఆమె చనిపోయిన 17రోజులకు తన తల్లి క్యాన్సర్ బారిన పడిందని పరల్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ భయంకరమైన ఆరోపణలు తనపై వచ్చాయని.. అప్పటినుండి ప్రతిరోజూ పీడకలలు తనను వెంటాడుతున్నాయని.. ఇవన్నీ తనను కలచి వేశాయని ఆవేదన వ్యకతం చేశారు.
తన తల్లి క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో ఆమె పక్క లేకుండా ఓ నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికీ ఈ సంఘటనల నుండి బయటపలేకపోతున్నానని చెప్పారు. అయితే తనకు అండగా నిలిచిన స్నేహితులకు, మద్దతు తెలిపిన సన్నిహితులకు కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో బాధితురాలైన బాలికకు పదేళ్ల క్రితమే వివాహం జరిగిందని.. రెండేళ్లుగా ఆమె కనిపించడం లేదని బాధితురాలు తల్లి కోర్టుకి వెల్లడించింది. అంతేకాకుండా పరల్ వి పూరికి మద్దతిస్తూ.. ఈ కేసుకి అతడికి సంబంధం లేదని.. ఇవి ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేసింది.
This post was last modified on June 29, 2021 9:26 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…