‘నాగిని 3’ ఫేమ్ పరల్ వి పూరిను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ బాలికను కిడ్నాప్ చేసి కారులో లైంగిక దాడి చేశాడని.. పలుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పరల్ తో పాటు అతడి స్నేహితులపై కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పలువురు బుల్లితెర నటులు, నిర్మాత ఏక్తా కపూర్.. పరల్ వి పూరికి మద్దతుగా నిలిచారు.
రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చిన పరల్ దాదాపు రెండు వారాల తరువాత మొదటిసారి ఈ కేసుపై నోరు విప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. కాలం మనుషులను ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటుందని అన్నారు. ఇటీవల తన నాన్నమ్మను కోల్పోయానని.. ఆమె చనిపోయిన 17రోజులకు తన తల్లి క్యాన్సర్ బారిన పడిందని పరల్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ భయంకరమైన ఆరోపణలు తనపై వచ్చాయని.. అప్పటినుండి ప్రతిరోజూ పీడకలలు తనను వెంటాడుతున్నాయని.. ఇవన్నీ తనను కలచి వేశాయని ఆవేదన వ్యకతం చేశారు.
తన తల్లి క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో ఆమె పక్క లేకుండా ఓ నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికీ ఈ సంఘటనల నుండి బయటపలేకపోతున్నానని చెప్పారు. అయితే తనకు అండగా నిలిచిన స్నేహితులకు, మద్దతు తెలిపిన సన్నిహితులకు కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో బాధితురాలైన బాలికకు పదేళ్ల క్రితమే వివాహం జరిగిందని.. రెండేళ్లుగా ఆమె కనిపించడం లేదని బాధితురాలు తల్లి కోర్టుకి వెల్లడించింది. అంతేకాకుండా పరల్ వి పూరికి మద్దతిస్తూ.. ఈ కేసుకి అతడికి సంబంధం లేదని.. ఇవి ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేసింది.
This post was last modified on June 29, 2021 9:26 am
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…