సామాజిక సమస్యల మీద సినిమాల్లోనే కాక.. బయట కూడా గట్టిగా గళాన్ని వినిపిస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట మహిళల మీద అఘాయిత్యాలు జరిగినపుడు.. మరికొన్ని సందర్భాల్లో సూర్య ఆవేదనతో స్పందించడం చూస్తూనే ఉంటాం. తమ అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక.. ఏవైనా బర్నింగ్ ఇష్యూస్ నడుస్తున్నపుడు బాధితుల తరఫున సూర్య వాయిస్ వినిపిస్తుంటాడు. తన సినిమాల ద్వారా కూడా ఏదో ఒక మంచి చెప్పాలనే ప్రయత్నిస్తుంటాడతను.
ప్రస్తుతం సూర్య చేస్తున్న ఓ సినిమా కూడా ఓ సామాజిక సమస్య చుట్టూ తిరిగేదే. తమిళనాట సంచలనం రేపిన ఓ కేసు ఆధారంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్లోనే ఇది తెరకెక్కుతోంది.
రెండేళ్ల కిందట తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం వల్ల కొన్ని రోజుల పాటు తమిళనాడు అట్టుడికిపోయింది. అప్పట్లో రాజకీయంగా కూడా ఇది దుమారం రేపింది. సూర్య సహా సెలబ్రెటీలందరూ అప్పట్లో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆ ఘటన నేపథ్యంలోనే పాండిరాజ్.. సూర్య కొత్త చిత్రానికి కథ అల్లాడట. ఇందులో సూర్య అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వేటాడే వ్యక్తిగా కనిపిస్తాడట.
రాఖీ లాంటి సినిమాలు ఇలాంటి కథలతో తెరకెక్కినవే. ఐతే పాండిరాజ్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. సూర్య గత సినిమాల్లాగే ఇది కూడా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాల కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్.. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా నటిస్తోంది. ఆమెకిదే తొలి తమిళ చిత్రం.
This post was last modified on June 28, 2021 5:54 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…