సామాజిక సమస్యల మీద సినిమాల్లోనే కాక.. బయట కూడా గట్టిగా గళాన్ని వినిపిస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట మహిళల మీద అఘాయిత్యాలు జరిగినపుడు.. మరికొన్ని సందర్భాల్లో సూర్య ఆవేదనతో స్పందించడం చూస్తూనే ఉంటాం. తమ అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక.. ఏవైనా బర్నింగ్ ఇష్యూస్ నడుస్తున్నపుడు బాధితుల తరఫున సూర్య వాయిస్ వినిపిస్తుంటాడు. తన సినిమాల ద్వారా కూడా ఏదో ఒక మంచి చెప్పాలనే ప్రయత్నిస్తుంటాడతను.
ప్రస్తుతం సూర్య చేస్తున్న ఓ సినిమా కూడా ఓ సామాజిక సమస్య చుట్టూ తిరిగేదే. తమిళనాట సంచలనం రేపిన ఓ కేసు ఆధారంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్లోనే ఇది తెరకెక్కుతోంది.
రెండేళ్ల కిందట తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం వల్ల కొన్ని రోజుల పాటు తమిళనాడు అట్టుడికిపోయింది. అప్పట్లో రాజకీయంగా కూడా ఇది దుమారం రేపింది. సూర్య సహా సెలబ్రెటీలందరూ అప్పట్లో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆ ఘటన నేపథ్యంలోనే పాండిరాజ్.. సూర్య కొత్త చిత్రానికి కథ అల్లాడట. ఇందులో సూర్య అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వేటాడే వ్యక్తిగా కనిపిస్తాడట.
రాఖీ లాంటి సినిమాలు ఇలాంటి కథలతో తెరకెక్కినవే. ఐతే పాండిరాజ్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. సూర్య గత సినిమాల్లాగే ఇది కూడా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాల కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్.. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా నటిస్తోంది. ఆమెకిదే తొలి తమిళ చిత్రం.
This post was last modified on June 28, 2021 5:54 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…