సామాజిక సమస్యల మీద సినిమాల్లోనే కాక.. బయట కూడా గట్టిగా గళాన్ని వినిపిస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట మహిళల మీద అఘాయిత్యాలు జరిగినపుడు.. మరికొన్ని సందర్భాల్లో సూర్య ఆవేదనతో స్పందించడం చూస్తూనే ఉంటాం. తమ అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక.. ఏవైనా బర్నింగ్ ఇష్యూస్ నడుస్తున్నపుడు బాధితుల తరఫున సూర్య వాయిస్ వినిపిస్తుంటాడు. తన సినిమాల ద్వారా కూడా ఏదో ఒక మంచి చెప్పాలనే ప్రయత్నిస్తుంటాడతను.
ప్రస్తుతం సూర్య చేస్తున్న ఓ సినిమా కూడా ఓ సామాజిక సమస్య చుట్టూ తిరిగేదే. తమిళనాట సంచలనం రేపిన ఓ కేసు ఆధారంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్లోనే ఇది తెరకెక్కుతోంది.
రెండేళ్ల కిందట తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం వల్ల కొన్ని రోజుల పాటు తమిళనాడు అట్టుడికిపోయింది. అప్పట్లో రాజకీయంగా కూడా ఇది దుమారం రేపింది. సూర్య సహా సెలబ్రెటీలందరూ అప్పట్లో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆ ఘటన నేపథ్యంలోనే పాండిరాజ్.. సూర్య కొత్త చిత్రానికి కథ అల్లాడట. ఇందులో సూర్య అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వేటాడే వ్యక్తిగా కనిపిస్తాడట.
రాఖీ లాంటి సినిమాలు ఇలాంటి కథలతో తెరకెక్కినవే. ఐతే పాండిరాజ్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. సూర్య గత సినిమాల్లాగే ఇది కూడా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాల కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్.. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా నటిస్తోంది. ఆమెకిదే తొలి తమిళ చిత్రం.
This post was last modified on June 28, 2021 5:54 am
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…