తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాదిలో చెన్నైలోని పోయిస్ గార్డెన్ ప్రాంతంలో కొత్తింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఇంటి కోసం ధనుష్ ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం బయటకొచ్చింది. దాదాపు 19000 చదరపు గజాల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. నాలుగు అంతస్తులుగా నిర్మిస్తోన్న ఈ భావన కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.
ఈ ఇంట్లోని గదులను ధనుష్ తనకు నచ్చినట్లుగా స్పెషల్ డిజైన్ చేయిస్తున్నారట. ఇంటీరియర్ డెకరేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇంటికి దగ్గరలోలోనే ఈ ఇల్లు ఉండడం విశేషం. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లాడు ధనుష్. తిరిగొచ్చిన తరువాత దర్శకుడు కార్తీక్ నరేన్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ను పునఃప్రాంభించనున్నాడు.
రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి అంగీకరించాడు ధనుష్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమైతే కెరీర్ పరంగా ధనుష్ చాలా బిజీగా ఉన్నాడు.
This post was last modified on June 27, 2021 6:28 pm
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…