తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాదిలో చెన్నైలోని పోయిస్ గార్డెన్ ప్రాంతంలో కొత్తింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఇంటి కోసం ధనుష్ ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం బయటకొచ్చింది. దాదాపు 19000 చదరపు గజాల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. నాలుగు అంతస్తులుగా నిర్మిస్తోన్న ఈ భావన కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.
ఈ ఇంట్లోని గదులను ధనుష్ తనకు నచ్చినట్లుగా స్పెషల్ డిజైన్ చేయిస్తున్నారట. ఇంటీరియర్ డెకరేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇంటికి దగ్గరలోలోనే ఈ ఇల్లు ఉండడం విశేషం. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లాడు ధనుష్. తిరిగొచ్చిన తరువాత దర్శకుడు కార్తీక్ నరేన్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ను పునఃప్రాంభించనున్నాడు.
రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి అంగీకరించాడు ధనుష్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమైతే కెరీర్ పరంగా ధనుష్ చాలా బిజీగా ఉన్నాడు.
This post was last modified on June 27, 2021 6:28 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…