Movie News

రూ.150 కోట్లతో ధనుష్ కొత్తిల్లు!

తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాదిలో చెన్నైలోని పోయిస్ గార్డెన్ ప్రాంతంలో కొత్తింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఇంటి కోసం ధనుష్ ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం బయటకొచ్చింది. దాదాపు 19000 చదరపు గజాల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. నాలుగు అంతస్తులుగా నిర్మిస్తోన్న ఈ భావన కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

ఈ ఇంట్లోని గదులను ధనుష్ తనకు నచ్చినట్లుగా స్పెషల్ డిజైన్ చేయిస్తున్నారట. ఇంటీరియర్ డెకరేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇంటికి దగ్గరలోలోనే ఈ ఇల్లు ఉండడం విశేషం. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లాడు ధనుష్. తిరిగొచ్చిన తరువాత దర్శకుడు కార్తీక్ నరేన్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ను పునఃప్రాంభించనున్నాడు.

రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి అంగీకరించాడు ధనుష్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమైతే కెరీర్ పరంగా ధనుష్ చాలా బిజీగా ఉన్నాడు.

This post was last modified on June 27, 2021 6:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

52 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

2 hours ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

3 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago