నిర్మాత దిల్ రాజుకు టాలీవుడ్లో ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల క్వాలిటీ పరంగా చూసుకున్నా, క్వాంటిటీ పరంగా చూసుకున్నా ఆయన టాలీవుడ్లో ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు. రెండు దశాబ్దాలుగా ఆయన నిలకడగా టాలీవుడ్లో తన ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ఐతే ఇప్పుడు రాజుకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని ఉన్నట్లు కనిపిస్తోంది.
ఓవైపు విజయ్తో ద్విభాషా చిత్రం ద్వారా తమిళంలో అడుగు పెట్టబోతున్నాడు. మరోవైపు బాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు నిర్మిస్తూ ఉత్తరాదినా తన ప్రాబల్యాన్ని చాటి చెప్పాలని చూస్తున్నాడు. ఐతే హిందీలో రాజు చేస్తున్న మూడు చిత్రాలూ రీమేక్లే కావడం విశేషం. ముందుగా జెర్సీ రీమేక్ను మొదలు పెట్టిన రాజు.. ఆ తర్వాత ఎఫ్-2 రీమేక్ను లైన్లోకి తెచ్చాడు. తాజాగా నాంది రీమేక్ను కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఆయన్ని రీమేక్ రాజు అనేస్తున్నారు అందరూ.
ఐతే బాలీవుడ్లో రాజు తెలివిగా అడుగులు వేస్తున్నాడన్నది స్పష్టం. తనకు గ్రిప్ లేని ఇండస్ట్రీలో నేరుగా స్ట్రెయిట్ చిత్రాలు… అందులోనూ భారీ స్థాయివి తీసి రిస్క్ చేయడం ఎందుకని రాజు ఆలోచిస్తున్నట్లుంది. తెలుగులో బాగా ఆడిన కథలు తీసుకుని, పేరున్న బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అక్కడ సేఫ్గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాలు కచ్చితంగా మంచి విజయం సాధిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇవి వర్కవుట్ అయి ముందు బలమైన పునాది పడితే.. ఆ తర్వాత రాజు బాలీవుడ్లో ఆధిపత్యం చలాయించడానికి అవకాశముంటుంది. ఎలాగూ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు రాజు. అది బాహుబలి తరహా భారీ సినిమా అంటున్నారు. ముందు ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో రాజు ఏంటో బాలీవుడ్కు తెలుస్తుంది. తర్వాత ప్రభాస్-ప్రశాంత్ సినిమాతో ఒక్కసారిగా విజృంభించి టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడేమో.
This post was last modified on June 27, 2021 2:16 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…