Movie News

రాధేశ్యామ్.. ఓ పనైపోతుంది బాబూ

లాక్ డౌన్-2 విరామానికి ముందు ప్రభాస్ సినిమాలు మూడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. అవే.. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్. మొదటి సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. రెండోది మధ్య దశలో ఉంది. చివరి చిత్రం షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే జరిగింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్‌కు అనుమతులు లభించిన నేపథ్యంలో ఆ మూడు చిత్రాల బృందాలూ ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి.

ముందుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ పని మొదలుపెడతాడని ఇంతకుముందు వార్తలు రాగా.. ఆ తర్వాత ‘సలార్’ కోసం పని చేస్తాడని ప్రచారం సాగింది. తర్వాతేమో ‘రాధేశ్యామ్’ షూటింగ్ పున:ప్రారంభిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఐతే బ్రేక్ తర్వాత ప్రభాస్ ఏ సినిమా పని మొదలుపెడుతున్నాడో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ సెట్లోకే ప్రభాస్ అడుగు పెట్టాడు.

‘రాధేశ్యామ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు హీరోయిన్ పూజా హెగ్డే శుక్రవారం అప్‌డేట్ ఇచ్చింది. ఆమె షూటింగ్‌లో అడుగు పెట్టిందంటే ఆటోమేటిగ్గా ప్రభాస్ కూడా వస్తున్నట్లే. ఈ సినిమా చిత్రీకరణ ఇంకో రెండు మూడు వారాలే మిగిలి ఉంది. అది కాన్చిచ్చేస్తే ప్రభాస్ పనైపోతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలుంటుంది. మధ్యలో కొంచెం వీలు చేసుకుని డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా షూటింగ్ ముందుగా పూర్తి చేసి ఓ పనైపోయింది అనిపించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లుంది.

దీని తర్వాత ప్రభాస్ సమాంతరంగా ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ను జులై నెలాఖర్లో రిలీజ్ చేయాలని ఇంతకుముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యపడేలా లేదు. ఇప్పుడు దాని మేకర్స్ దసరా రిలీజ్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

This post was last modified on June 25, 2021 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

11 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago