టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరిగినప్పటికీ తమన్నాకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ‘ఎఫ్ 3’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే యంగ్ హీరో సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
ఇప్పటికే ఆమె నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడో సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ ను చేయబోతుంది. దీనికి ‘యారీ దోస్తీ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరెక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న లవర్ పాత్రలో కనిపించబోతుంది.
కెరీర్ పరంగా సరికొత్త పాత్రల్లో నటించాలనేది తమన్నా ఆలోచన. అందుకే వెబ్ సిరీస్ ల ద్వారా డిఫరెంట్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ సిరీస్ ను హిందీలో రూపొందించబోతున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లి.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on June 25, 2021 9:08 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…