టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరిగినప్పటికీ తమన్నాకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ‘ఎఫ్ 3’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే యంగ్ హీరో సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
ఇప్పటికే ఆమె నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడో సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ ను చేయబోతుంది. దీనికి ‘యారీ దోస్తీ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరెక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న లవర్ పాత్రలో కనిపించబోతుంది.
కెరీర్ పరంగా సరికొత్త పాత్రల్లో నటించాలనేది తమన్నా ఆలోచన. అందుకే వెబ్ సిరీస్ ల ద్వారా డిఫరెంట్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ సిరీస్ ను హిందీలో రూపొందించబోతున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లి.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on June 25, 2021 9:08 am
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…