టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరిగినప్పటికీ తమన్నాకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ‘ఎఫ్ 3’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే యంగ్ హీరో సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
ఇప్పటికే ఆమె నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడో సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ ను చేయబోతుంది. దీనికి ‘యారీ దోస్తీ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరెక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న లవర్ పాత్రలో కనిపించబోతుంది.
కెరీర్ పరంగా సరికొత్త పాత్రల్లో నటించాలనేది తమన్నా ఆలోచన. అందుకే వెబ్ సిరీస్ ల ద్వారా డిఫరెంట్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ సిరీస్ ను హిందీలో రూపొందించబోతున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లి.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…