Movie News

వెబ్ సిరీస్ కోసం తమన్నా నెగెటివ్ రోల్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరిగినప్పటికీ తమన్నాకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ‘ఎఫ్ 3’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే యంగ్ హీరో సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

ఇప్పటికే ఆమె నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడో సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ ను చేయబోతుంది. దీనికి ‘యారీ దోస్తీ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరెక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న లవర్ పాత్రలో కనిపించబోతుంది.

కెరీర్ పరంగా సరికొత్త పాత్రల్లో నటించాలనేది తమన్నా ఆలోచన. అందుకే వెబ్ సిరీస్ ల ద్వారా డిఫరెంట్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ సిరీస్ ను హిందీలో రూపొందించబోతున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లి.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

This post was last modified on June 25, 2021 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

51 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago