ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’లో వేడి రాజుకుంది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు ప్యానెళ్లను రెడీ చేసుకుంటుంటే.. ఏ ప్యానల్ తో సంబంధం లేకుండా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు జీవిత రాజశేఖర్. ఇప్పుడు అలానే సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా ప్యానెల్ తో సంబంధం లేకుండా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయబోతున్నారని సమాచారం.
కొంతకాలంగా ‘మా’ వ్యవహార విషయంలో సాయికుమార్ అసంతృప్తిగా ఉన్నారట. ఎన్నికల సమయంలో ఆయన్ను పిలిపించి చిన్న పోస్ట్ లకు సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తున్నారు. వాళ్లు ఆఫర్ చేసే పోస్ట్ లు సాయికుమార్ కి నచ్చకపోయినా.. కాదనలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో తనకున్న అనుభవం, తన సీనియారిటీని కన్సిడర్ చేయకుండా ‘మా’ అసోసియేషన్ సాయికుమార్ కి పోస్ట్ లు ఆఫర్ చేస్తోంది.
ఇంతకాలంగా తనకు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్ట్ లతో సరిపెడుతుండడంతో ఇప్పుడు ఆయన ధైర్యం చేసి నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా జనరల్ సెక్రటరీ పోస్ట్ కి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సాయి కుమార్ కొన్ని సినిమాల్లో అలానే బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు.
This post was last modified on June 23, 2021 3:07 pm
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…