దర్శక ధీరుడు ‘బాహుబలి’ అనే అద్భుతాన్ని ఆవిష్కరించడంలో రామోజీ రావు తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది రామోజీ వారి ఫిలిం సిటీలోనే అన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోకుండా సుదీర్ఘ కాలం షూటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించడంతో పాటు ఈ చిత్రానికి ఆయన ఫైనాన్స్ కూడా చేశారనే ప్రచారం ఉంది. అంతేసి భారీ సెట్లు వేసి, భారీ తారాగణంతో షూటింగ్ చేయడం వేరే చోట్ల సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ‘బాహుబలి’ విజయంలో రామోజీ పోషించిన పాత్ర ప్రత్యేకమైంది.
ఐతే సినిమా విడుదల తర్వాత ఆర్థిక విషయాలు దగ్గరికి వచ్చేసరికి రామోజీ రావుకు.. రాజమౌళి, నిర్మాతలకు మధ్య వివాదం తలెత్తినట్లుగా అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. ఈ వివాదం తాత్కాలికమే అని.. కొన్ని రోజులకు పరిస్థితులు సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ రాజమౌళికి, రామోజీకి మధ్య విభేదాలు శాశ్వతం అయినట్లుగా ఇప్పుడు సందేహాలు రేకెత్తుతున్నాయి.
రాజమౌళి సినిమాల స్కేల్ ప్రకారం చూస్తే ఆయన ప్రతి చిత్రానికీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాలి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం జక్కన్న అటు వైపే చూడట్లేదు. మొదట్నుంచి ఫిలిం సిటీలో షూటింగ్ అనే మాటే ఉండట్లేదు. కరోనా టైంలో బయట షూటింగ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తినా జక్కన్న ఈ విషయంలో పునరాలోచించలేదు. సిటీకి చాలా దూరంగా ఉండే ఫిలిం సిటీలో అయితే ఏ రకమైన డిస్టబెన్స్ ఉండదు. అలాగే కొవిడ్ నిబంధనల గురించి కూడా భయపడాల్సిన పని లేదు. ఈ కారణంతోనే వివిధ ఇండస్ట్రీల నుంచి ఫిలిం మేకర్స్ వచ్చి అక్కడ ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా అక్కడ ప్లాన్ చేసి ఉంటే ఈపాటికి సినిమా పూర్తయిపోయేదేని… అక్కడికి వెళ్లకపోవడం వల్లే ఎక్కువ రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఐతే ఎంత ఇబ్బంది ఎదురైనప్పటికీ జక్కన్న ఫిలిం సిటీలో షూటింగ్ ఆలోచన మాత్రం చేయలేదని.. రామోజీతో ఆయనకు గట్టిగానే చెడినట్లు ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 22, 2021 8:30 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…