దర్శక ధీరుడు ‘బాహుబలి’ అనే అద్భుతాన్ని ఆవిష్కరించడంలో రామోజీ రావు తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది రామోజీ వారి ఫిలిం సిటీలోనే అన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోకుండా సుదీర్ఘ కాలం షూటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించడంతో పాటు ఈ చిత్రానికి ఆయన ఫైనాన్స్ కూడా చేశారనే ప్రచారం ఉంది. అంతేసి భారీ సెట్లు వేసి, భారీ తారాగణంతో షూటింగ్ చేయడం వేరే చోట్ల సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ‘బాహుబలి’ విజయంలో రామోజీ పోషించిన పాత్ర ప్రత్యేకమైంది.
ఐతే సినిమా విడుదల తర్వాత ఆర్థిక విషయాలు దగ్గరికి వచ్చేసరికి రామోజీ రావుకు.. రాజమౌళి, నిర్మాతలకు మధ్య వివాదం తలెత్తినట్లుగా అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. ఈ వివాదం తాత్కాలికమే అని.. కొన్ని రోజులకు పరిస్థితులు సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ రాజమౌళికి, రామోజీకి మధ్య విభేదాలు శాశ్వతం అయినట్లుగా ఇప్పుడు సందేహాలు రేకెత్తుతున్నాయి.
రాజమౌళి సినిమాల స్కేల్ ప్రకారం చూస్తే ఆయన ప్రతి చిత్రానికీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాలి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం జక్కన్న అటు వైపే చూడట్లేదు. మొదట్నుంచి ఫిలిం సిటీలో షూటింగ్ అనే మాటే ఉండట్లేదు. కరోనా టైంలో బయట షూటింగ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తినా జక్కన్న ఈ విషయంలో పునరాలోచించలేదు. సిటీకి చాలా దూరంగా ఉండే ఫిలిం సిటీలో అయితే ఏ రకమైన డిస్టబెన్స్ ఉండదు. అలాగే కొవిడ్ నిబంధనల గురించి కూడా భయపడాల్సిన పని లేదు. ఈ కారణంతోనే వివిధ ఇండస్ట్రీల నుంచి ఫిలిం మేకర్స్ వచ్చి అక్కడ ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా అక్కడ ప్లాన్ చేసి ఉంటే ఈపాటికి సినిమా పూర్తయిపోయేదేని… అక్కడికి వెళ్లకపోవడం వల్లే ఎక్కువ రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఐతే ఎంత ఇబ్బంది ఎదురైనప్పటికీ జక్కన్న ఫిలిం సిటీలో షూటింగ్ ఆలోచన మాత్రం చేయలేదని.. రామోజీతో ఆయనకు గట్టిగానే చెడినట్లు ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 22, 2021 8:30 am
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…