రామాయణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ రామాయణ గాథ నేపథ్యంలోనే అన్న సంగతి తెలిసిందే. కాగా ‘సీత’ పేరుతో హిందీలో రామాయణాన్ని మరో కోణంలో చూపించే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టు సమకూర్చడం విశేషం. ఇందులో
సీతగా లీడ్ రోల్ చేసేదెవరనే విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ముందు ఈ పాత్రకు ఆలియా భట్ పేరు వినిపించగా.. ఆ తర్వాత కరీనా లైన్లోకి వచ్చింది. ఆమె సీత పాత్రకు దాదాపు ఖరారైనట్లే అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమె పేరు వివాదంలో చిక్కుకుంది. ముస్లిం అయిన సైఫ్ అలీ ఖాన్ను పెళ్లాడటమే కాక.. తన కొడుక్కి మొగల్ పేరు పెట్టుకున్న కరీనా సీత పాత్రలో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు నడిచాయి.
ఈ నేపథ్యంలో ఇటు మేకర్స్.. అటు కరీనా ‘సీత’ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో కరీనా ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్లే అంటున్నారు. ఆలియాకేమో ఈ సినిమా చేసేంత తీరిక లేదట. దీంతో ఇప్పుడు సీత పాత్ర కోసం కంగనా రనౌత్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇండియాలో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికొస్తే కంగనాకున్న ఇమేజ్, మార్కెట్ ఇంకెవరికీ లేవు. వ్యక్తిగతంలో కంగనా వివాదాల మాటెలా ఉన్నా.. ఆమె అద్భుతమైన పెర్ఫామర్ అనే విషయంలో మరో మాట లేదు.
‘సీత’ సినిమాలో ఆమె నటిస్తే ఆ మూవీ రేంజే మారిపోతుంది. అందుకే ఆమెను ఈ ప్రాజెక్టులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరీనాను ట్రోల్ చేసినపుడే సీత పాత్రకు కంగనాను తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. విజయేంద్ర మీద కంగనాకు ఎంతో గౌరవం ఉంది. మణికర్ణిక కోసం ఇద్దరూ కలిసి పని చేశారు. ఆ సమయంలో ఆయనకు పాదాభివందనం కూడా చేసింది కంగనా. ఆమెపై విజయేంద్ర కూడా ప్రత్యేక అభిమానం చూపిస్తారు. కాబట్టి ఈ ఇద్దరూ మరోసారి జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on June 22, 2021 8:23 am
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…