రామాయణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ రామాయణ గాథ నేపథ్యంలోనే అన్న సంగతి తెలిసిందే. కాగా ‘సీత’ పేరుతో హిందీలో రామాయణాన్ని మరో కోణంలో చూపించే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టు సమకూర్చడం విశేషం. ఇందులో
సీతగా లీడ్ రోల్ చేసేదెవరనే విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ముందు ఈ పాత్రకు ఆలియా భట్ పేరు వినిపించగా.. ఆ తర్వాత కరీనా లైన్లోకి వచ్చింది. ఆమె సీత పాత్రకు దాదాపు ఖరారైనట్లే అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమె పేరు వివాదంలో చిక్కుకుంది. ముస్లిం అయిన సైఫ్ అలీ ఖాన్ను పెళ్లాడటమే కాక.. తన కొడుక్కి మొగల్ పేరు పెట్టుకున్న కరీనా సీత పాత్రలో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు నడిచాయి.
ఈ నేపథ్యంలో ఇటు మేకర్స్.. అటు కరీనా ‘సీత’ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో కరీనా ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్లే అంటున్నారు. ఆలియాకేమో ఈ సినిమా చేసేంత తీరిక లేదట. దీంతో ఇప్పుడు సీత పాత్ర కోసం కంగనా రనౌత్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇండియాలో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికొస్తే కంగనాకున్న ఇమేజ్, మార్కెట్ ఇంకెవరికీ లేవు. వ్యక్తిగతంలో కంగనా వివాదాల మాటెలా ఉన్నా.. ఆమె అద్భుతమైన పెర్ఫామర్ అనే విషయంలో మరో మాట లేదు.
‘సీత’ సినిమాలో ఆమె నటిస్తే ఆ మూవీ రేంజే మారిపోతుంది. అందుకే ఆమెను ఈ ప్రాజెక్టులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరీనాను ట్రోల్ చేసినపుడే సీత పాత్రకు కంగనాను తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. విజయేంద్ర మీద కంగనాకు ఎంతో గౌరవం ఉంది. మణికర్ణిక కోసం ఇద్దరూ కలిసి పని చేశారు. ఆ సమయంలో ఆయనకు పాదాభివందనం కూడా చేసింది కంగనా. ఆమెపై విజయేంద్ర కూడా ప్రత్యేక అభిమానం చూపిస్తారు. కాబట్టి ఈ ఇద్దరూ మరోసారి జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…