తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ప్రకాష్ రాజ్ నిలబడబోతున్నారు. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్రాజ్ వెల్లడించారు. గత రెండు పర్యాయాలు మా ఎన్నికల సందర్భంగా జరిగిన రచ్చ గురించి తెలిసిందే.
నాలుగేళ్ల కిందట అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడ్డపుడు.. రెండేళ్ల కిందట నరేష్ పగ్గాలు చేపట్టినపుడు తలెత్తిన వివాదాల గురించి తెలిసిందే. మాలో పరిణామాల పట్ల మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది పెద్దలు తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేపథ్యంలో ఈసారి మంచి మార్పు జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చిరంజీవి సహా కొందరు ప్రముఖుల అండతో మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ప్రకాష్ రాజ్కు పోటీగా ఎవరు నిలబడతారన్నది ఆసక్తికరం. ఎవరు నిలబడ్డా ఆయన తెలుగు నటుడు కాదు అనే వాదన తీసుకు వచ్చే అవకాశముంది. ఐతే ప్రకాష్ రాజ్కు ఇప్పటికే చిరంజీవి తమ్ముడు నాగబాబు మద్దతు పలుకుతూ ఆయన నాన్ లోకల్ అనే మాట రాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్రాజ్ లాంటి వ్యక్తి ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు అయితే, తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని నాగబాబు అన్నారు.
ప్రకాశ్రాజ్ లాంటి వారు ఏ ఒక్క చిత్ర పరిశ్రమకో చెందినవారు కాదని, ఆయన భారతీయ నటుడని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఆయన ఎన్నిక విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజకీయంగా తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి తామంతా ఒకటేనని తెలిపారు. ఇక చిరంజీవి మద్దతు గురించి ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతివ్వరని.. మంచి చేస్తారని అనిపిస్తే సపోర్ట్ చేస్తారని.. అన్నయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వాడుకోనని అని వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on June 26, 2021 10:03 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…