మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలు, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్లు అలాంటి వివాదమే రాజేశాయి. ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంత పార్టీ వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఆయన ట్వీట్లు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేనే నిజమైన దేశభక్తుడి అభివర్ణిస్తూ నాగబాబు వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం.
‘‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’’.. ఇదీ నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.
గాడ్సే ఏ ఉద్దేశంతో గాంధీని చంపినా.. జాతి పితను అలా హతమార్చడం మాత్రం దారుణం. దీంతో అతణ్ని చరిత్ర హీనుడిగానే చూస్తోంది ప్రపంచం. ఆర్ఎస్ఎష్ వాళ్లు మాత్రం గాడ్సేను హీరో లాగా చూస్తుంటారు. అతణ్ని కొనియాడుతుంటారు. ఇప్పుడు నాగబాబు ఈ ట్వీట్లు వేయడంతో అవి ‘బీజేపీ’ రంగు పులుముకుంటున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ అవసరానికి మించి భాజపాను లేపుతున్నాడనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తుండగా.. ఇప్పుడు నాగబాబు అవసరం లేని టాపిక్ తీసుకుని అగ్గి రాజేశారు. ఆ ట్వీట్ల కింద కామెంట్లు చూస్తే నాగబాబు తానేం చేశానో ఒక అంచనాకు రాగలరేమో.
This post was last modified on May 19, 2020 2:30 pm
యూరోపియన్ దేశాలుగా పేరొందిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్విట్జర్లాండ్, నార్వే, స్పెయిన్, ఉక్రెయిన్, పోలాండ్ సహా 25 దేశాల…
కొత్త ఏడాది ఆరంభమవుతుంటే.. తెలుగు ప్రేక్షకుల దృష్టంతా సంక్రాంతి మీదే ఉంటుంది. ఆ పండక్కి భారీ చిత్రాలు, ఎక్కువ సంఖ్యలో…
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్…
టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్…
మాటలు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టం. డైలాగులు పెట్టకుండా కేవలం సీన్స్ తో కన్విన్స్ చేయడం అసాధ్యం కాబట్టి దర్శక…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్…