మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలు, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్లు అలాంటి వివాదమే రాజేశాయి. ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంత పార్టీ వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఆయన ట్వీట్లు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేనే నిజమైన దేశభక్తుడి అభివర్ణిస్తూ నాగబాబు వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం.
‘‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’’.. ఇదీ నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.
గాడ్సే ఏ ఉద్దేశంతో గాంధీని చంపినా.. జాతి పితను అలా హతమార్చడం మాత్రం దారుణం. దీంతో అతణ్ని చరిత్ర హీనుడిగానే చూస్తోంది ప్రపంచం. ఆర్ఎస్ఎష్ వాళ్లు మాత్రం గాడ్సేను హీరో లాగా చూస్తుంటారు. అతణ్ని కొనియాడుతుంటారు. ఇప్పుడు నాగబాబు ఈ ట్వీట్లు వేయడంతో అవి ‘బీజేపీ’ రంగు పులుముకుంటున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ అవసరానికి మించి భాజపాను లేపుతున్నాడనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తుండగా.. ఇప్పుడు నాగబాబు అవసరం లేని టాపిక్ తీసుకుని అగ్గి రాజేశారు. ఆ ట్వీట్ల కింద కామెంట్లు చూస్తే నాగబాబు తానేం చేశానో ఒక అంచనాకు రాగలరేమో.
This post was last modified on May 19, 2020 2:30 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…