కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్, తన భార్య జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించబోతున్నారు.
శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్.. వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ని డైరెక్ట్ చేయబోతున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాను రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
ఇందులో ధనుష్ తో పాటు కథ ప్రకారం.. మరో హీరోకి కూడా చోటుందట. కానీ మిడిల్ ఏజ్డ్ హీరో పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతానికి అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒక పేరుని ఫైనల్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ఓ సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. అలానే తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమాను మొదలుపెడతారు.
This post was last modified on June 18, 2021 12:25 pm
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…