కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్, తన భార్య జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించబోతున్నారు.
శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్.. వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ని డైరెక్ట్ చేయబోతున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాను రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
ఇందులో ధనుష్ తో పాటు కథ ప్రకారం.. మరో హీరోకి కూడా చోటుందట. కానీ మిడిల్ ఏజ్డ్ హీరో పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతానికి అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒక పేరుని ఫైనల్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ఓ సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. అలానే తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమాను మొదలుపెడతారు.
This post was last modified on June 18, 2021 12:25 pm
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…