బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు నీనా గుప్తా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్న ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్లోనూ సత్తా చాటుతోంది. బదాయి హో, ముల్క్, సర్దార్ కా గ్రాండ్ సన్ లాంటి సినిమాల్లో నీనా నటనకు గొప్ప ప్రశంసలు లభించాయి. సినీ రంగంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నటి.. ఇటీవలే ‘సచ్ కహు తో’ పేరుతో తన ఆత్మకథను రాసింది. అందులో కొన్ని సంచలన విషయాలూ ఉన్నాయి.
ముఖ్యంగా తాను కథానాయికగా ఉన్న రోజుల్లో దక్షిణాదికి చెందిన ఓ అగ్ర నిర్మాతతో ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె ఒక ఎపిసోడ్ రాసింది. సినిమా అవకాశం ఇస్తానంటూ పిలిచి తనతో పడుకోవాలని ఆ నిర్మాత బలవంతం చేసినట్లు నీనా వెల్లడించడం గమనార్హం. ఆ ఎపిసోడ్ గురించి కాస్త వివరంగానే చెప్పుకొచ్చింది నీనా.
ఒక సినిమాలో పాత్రకు సంబంధించి కలవమని ఓ సౌత్ టాప్ ప్రొడ్యూసర్ తనను హోటల్కు పిలిచాడని.. ఐతే అక్కడ తాను ఆయన్ని లాబీలో కలవాలని అనుకోగా ఆయన మాత్రం పైన తన గదికి రావాలని పిలిచాడని నీనా తెలిపింది. పైకి వెళ్లడం గురించి సందేహిస్తూనే అక్కడికి వెళ్లానని.. తాను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలో ప్రధాన పాత్రకు స్నేహితురాలి పాత్రను తనకు ఆఫర్ చేశాడని.. ఐతే అది చిన్న పాత్రగా అనిపించడంతో తాను చేయాలని అనుకోలేదని.. ఆ విషయం చెప్పి వెళ్లబోతుంటే తనతో ఆ నిర్మాత అసభ్యంగా మాట్లాడాడని నీనా చెప్పింది.
“ఎక్కడికి వెళ్తావు. నువ్వు ఈ రాత్రి నాతో గడపట్లేదా” అని సదరు నిర్మాత అడిగాడని.. దీంతో తాను షాకయ్యానని.. తల మీద ఒక బకెట్ ఐస్ వాటర్ పోసినట్లుగా అయిపోయానని.. తాను వెళ్లాలని అనడంతో ఆ నిర్మాత బ్యాగ్ తీసి తన చేతుల్లోకి విసిరి కొట్టాడని.. “వెళ్లాలంటే వెళ్లు.. నిన్నెవరూ ఇక్కడ బలవంతం చేయట్లేదు” అని కోపంగా చెప్పడంతో అక్కడి నుంచి బయటపడ్డానని నీనా వెల్లడించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…