పెన్ స్టూడియోస్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం సర్కిల్స్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వ్యాపారవేత్త జయంతిలాల్ గద నేతృత్వంలో ఈ సంస్థ పుష్కర కాలం కిందట్నుంచే సినిమాలు నిర్మిస్తోంది. స్టూడియో కూడా నెలకొల్పి సినీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే సినిమాల లైబ్రరీని కూడా మెయింటైన్ చేస్తోంది. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఈ సంస్థ ఇటీవల దూకుడు పెంచింది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఉత్తరాది థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం.. అలాగే ఆ చిత్ర డిజిటల్ హక్కులను కూడా హోల్సేల్గా కొనేయడం.. ఇందుకోసం మొత్తంగా రూ.500 కోట్ల దాకా వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వరుసగా కొన్ని భారీ చిత్రాలను కూడా ప్రకటించిందీ సంస్థ. కరోనా బ్రేక్ తర్వాత బాలీవుడ్లో అత్యంత దూకుడుగా సినిమాలు రిలీజ్ చేయబోతోంది ఈ సంస్థ. తమ నుంచి రాబోతున్న సినిమాలతో ఒక షో రీల్ కూడా రెడీ చేసింది పెన్ మూవీస్.
‘ఆర్ఆర్ఆర్’తో పాటు బాలీవుడ్లో మరికొన్ని భారీ చిత్రాలను తమ బేనర్ నుంచే రిలీజ్ చేస్తోంది పెన్ మూవీస్. అందులో కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న తొలి భారీ చిత్రం ‘బెల్ బాటమ్’ కూడా ఒకటి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జులై 27న విడుదల చేయనున్నారు. అలాగే జాన్ అబ్రహాం సినిమా ‘ఎటాక్’, ఆలియా భట్-సంజయ్ లీలా బన్సాలీల ‘గంగూభాయి కథియావాడి’లను కూడా పెన్ మూవీసే రిలీజ్ చేయబోతోంది. వీటితో పాటు ఈ షో రీల్లో తాము నిర్మించబోయే ‘అన్నియన్’ రీమేక్ను కూడా చూపించారు. శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఐతే ఆ సినిమా వచ్చే ఏడాది మొదలై.. ఆ తర్వాతి ఏడాది విడుదల కాబోతోంది. దాని గురించి కూడా వీడియోలో చూపించిన పెన్ మూవీస్.. మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ రీమేక్ ప్రస్తావన మాత్రం తేలేదు. నిజానికి ప్రస్తుతం పెన్ మూవీస్ ప్రొడక్షన్లో సెట్స్ మీదికి వెళ్లనున్న ఏకైక చిత్రమిదే. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో మరి.
This post was last modified on June 17, 2021 2:26 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…