పెన్ స్టూడియోస్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం సర్కిల్స్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వ్యాపారవేత్త జయంతిలాల్ గద నేతృత్వంలో ఈ సంస్థ పుష్కర కాలం కిందట్నుంచే సినిమాలు నిర్మిస్తోంది. స్టూడియో కూడా నెలకొల్పి సినీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే సినిమాల లైబ్రరీని కూడా మెయింటైన్ చేస్తోంది. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఈ సంస్థ ఇటీవల దూకుడు పెంచింది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఉత్తరాది థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం.. అలాగే ఆ చిత్ర డిజిటల్ హక్కులను కూడా హోల్సేల్గా కొనేయడం.. ఇందుకోసం మొత్తంగా రూ.500 కోట్ల దాకా వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వరుసగా కొన్ని భారీ చిత్రాలను కూడా ప్రకటించిందీ సంస్థ. కరోనా బ్రేక్ తర్వాత బాలీవుడ్లో అత్యంత దూకుడుగా సినిమాలు రిలీజ్ చేయబోతోంది ఈ సంస్థ. తమ నుంచి రాబోతున్న సినిమాలతో ఒక షో రీల్ కూడా రెడీ చేసింది పెన్ మూవీస్.
‘ఆర్ఆర్ఆర్’తో పాటు బాలీవుడ్లో మరికొన్ని భారీ చిత్రాలను తమ బేనర్ నుంచే రిలీజ్ చేస్తోంది పెన్ మూవీస్. అందులో కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న తొలి భారీ చిత్రం ‘బెల్ బాటమ్’ కూడా ఒకటి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జులై 27న విడుదల చేయనున్నారు. అలాగే జాన్ అబ్రహాం సినిమా ‘ఎటాక్’, ఆలియా భట్-సంజయ్ లీలా బన్సాలీల ‘గంగూభాయి కథియావాడి’లను కూడా పెన్ మూవీసే రిలీజ్ చేయబోతోంది. వీటితో పాటు ఈ షో రీల్లో తాము నిర్మించబోయే ‘అన్నియన్’ రీమేక్ను కూడా చూపించారు. శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఐతే ఆ సినిమా వచ్చే ఏడాది మొదలై.. ఆ తర్వాతి ఏడాది విడుదల కాబోతోంది. దాని గురించి కూడా వీడియోలో చూపించిన పెన్ మూవీస్.. మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ రీమేక్ ప్రస్తావన మాత్రం తేలేదు. నిజానికి ప్రస్తుతం పెన్ మూవీస్ ప్రొడక్షన్లో సెట్స్ మీదికి వెళ్లనున్న ఏకైక చిత్రమిదే. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో మరి.
This post was last modified on June 17, 2021 2:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…