ఒక షోలే.. ఒక జంజీర్.. ఒక దీవార్.. ఒక క్రాంతి.. ఒక సీతా ఔర్ గీత.. ఈ సినిమాల పేర్లు చెబితే పాత తరం హిందీ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 70, 80 దశకాల్లో భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలివి. బ్లాక్బస్టర్ అనే పదానికి అప్పట్లో అసలైన అర్థం చెప్పిన చిత్రాలివి. వీటి సృష్టికర్తలు.. సలీమ్ ఖాన్-జావెద్ అక్తర్. ఇండియన్ సినిమాలో రచయితలకు స్టార్ స్టేటస్ రావడం.. రచయితల పేర్లు చూసి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టడం వీరితోనే మొదలైంది. ముఖ్యంగా ‘షోలే’ సినిమాతో వీరికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి 24 చిత్రాలకు పని చేయడం విశేషం.
ఆ సినిమాలతో బాలీవుడ్లో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ ఇద్దరు రచయితల మీద ఇప్పుడు ఒక మెగా డాక్యుమెంటరీ రాబోతోంది. వారి గొప్పదనాన్ని తర్వాతి తరాలకు తెలియజేసే ప్రయత్నాన్ని వారి పిల్లలు చేస్తుండటం విశేషం.
సలీమ్ ఖాన్ తనయుడు సల్మాన్ ఖాన్.. జావెద్ అక్తర్ పిల్లలు ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ తమ సొంత నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో సలీమ్, జావెద్ల మీద డాక్యుమెంటరీ తీయబోతున్నట్లు ప్రకటించారు. జోయా సన్నిహితురాలు, దర్శకురాలైన రీమా కగ్తి కూడా వీరికి తోడవుతోంది. ‘ది యాంగ్రీ యంగ్మెన్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కనుంది. నమ్రతా రావు దీనికి దర్శకత్వం వహించనున్నారు.
అమితాబ్కు సూపర్ స్టార్ ఇమేజ్తో పాటు ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే ట్యాగ్ లైన్ రావడానికి సలీమ్-జావెద్లే కారణం. వారి సినిమాలు షోలే, జంజీర్, దీవార్లతోనే ఆయన ఎదిగారు. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ టైటిల్ వీళ్లకే పెట్టి భారీ స్థాయిలో డాక్యుమెంటరీ తీయడానికి వారి పిల్లలు ముందుకు రావడం విశేషం. రాజీ లేకుండా భారీ బడ్జెట్లో వీరి విజయ గాథను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు సల్మాన్, ఫర్హాన్, జోయా.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…