ఒకప్పుడు ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు శ్రీకాంత్. ఐతే ఆ తరం మీడియం రేంజ్ హీరోలు చాలామంది లాగే ఒక దశ దాటాక అతను కూడా ఇబ్బంది పడ్డాడు. హీరోగా మార్కెట్ కోల్పోయిన అతను.. అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కెరీర్ను నడిపిస్తూ వచ్చాడు కానీ.. లీడ్ రోల్స్ మాత్రం మానలేదు. కానీ ఒక దశ దాటాక శ్రీకాంత్ హీరోగా చేసే సినిమాలను జనాలు పట్టించుకోవడమే మానేశారు. ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ కూడా పెద్దగా లేకపోవడంతో శ్రీకాంత్ ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది.
ఇలాంటి టైంలోనే నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ చిత్రం కోసం విలన్ అవతారమెత్తాడు శ్రీకాంత్. ఇంతకుముందు కూడా శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేసినప్పటికీ.. అఖండ తన కెరీర్ను మలుపు తిప్పుతుందని అతను ఆశిస్తున్నాడు.
లెజెండ్ తర్వాత జగపతిబాబు లాగే అఖండ తర్వాత శ్రీకాంత్ విలన్గా బిజీ అయిపోతాడనే అంచనాలున్నాయి. ఐతే బాలయ్య మాత్రం ఇది కరెక్ట్ కాదు అంటుండటం గమనార్హం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో అఖండ గురించి మాట్లాడుతూ.. శ్రీకాంత్ ప్రస్తావన తెచ్చాడు. ఈ చిత్రంలో అతను అద్భుతమైన పాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. ఐతే అఖండ తర్వాత శ్రీకాంత్ పూర్తిగా విలన్ పాత్రలు ఎంచుకోవాలనుకుంటే అది సరి కాదంటూ తాను స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలయ్య చెప్పడం విశేషం.
విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా సినిమాలు చేయాలని తాను శ్రీకాంత్కు సూచించానని.. అతడి కోసం తనే స్వయంగా కథలు, పాత్రలను ఎంపిక చేసి ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్లు బాలయ్య పేర్కొనడం గమనార్హం. చూస్తుంటే అఖండ సినిమా చేస్తూ శ్రీకాంత్ బాలయ్యకు బాగానే దగ్గరైనట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్కు ఎలాంటి మలుపు తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on June 15, 2021 6:52 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…