అక్కినేని అఖిల్ తెరంగేట్రానికి ముందు నెలకొన్న హడావుడిని జనాలు అంత సులువుగా మరిచిపోలేరు. టాలీవుడ్లో ఇప్పటిదాకా ఏ వారసుడి అరంగేట్రంలోనూ లేనంత హంగామా అప్పుడు కనిపించింది. ఆ మాటకొస్తే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలి చిత్రానికి కూడా అంత హైప్ రాలేదు. అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ మీద దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ పెట్టడం.. రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. కానీ ఏం ప్రయోజనం. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అఖిల్ కెరీర్కు ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడింది.
ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా చేసిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలూ నిరాశనే మిగిల్చాయి. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైతేనేం అఖిల్కు అవకాశాలకైతే లోటు లేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో అతను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమా రిలీజై దాని ఫలితాన్ని బట్టి అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం విడుదల కాకముందే అఖిల్ చేతిలోకి క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ అనే భారీ చిత్రం ఖరారైంది. కెరీర్లో ఈ దశలో అంత పెద్ద దర్శకుడితో, భారీ చిత్రం చేసే అవకాశం రావడం ఆశ్చర్యం. ఇప్పుడేమో టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్గా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అఖిల్ సినిమా ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ బేనర్లో ఒక ప్రేమకథా చిత్రం చేయబోతున్నాడట అఖిల్. దర్శకుడెవరన్నది బయటికి రాలేదు కానీ.. స్క్రిప్టు ఓకే అయిందని, సినిమాను త్వరలోనే లాంఛనంగా ప్రకటించబోతున్నారని అంటున్నారు.
ఐతే మూడు డిజాస్టర్లు ఇచ్చినా అఖిల్కు ఇలా క్రేజీ సినిమాలు పడుతున్నాయంటే అది అతడి ఆకర్షణా.. లేక తెరవెనుక నాగ్ మంత్రాంగం వల్లనా అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. చాలామంది రెండో దానికే ఓటేస్తున్నారు.
This post was last modified on June 14, 2021 5:58 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…