అక్కినేని అఖిల్ తెరంగేట్రానికి ముందు నెలకొన్న హడావుడిని జనాలు అంత సులువుగా మరిచిపోలేరు. టాలీవుడ్లో ఇప్పటిదాకా ఏ వారసుడి అరంగేట్రంలోనూ లేనంత హంగామా అప్పుడు కనిపించింది. ఆ మాటకొస్తే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలి చిత్రానికి కూడా అంత హైప్ రాలేదు. అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ మీద దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ పెట్టడం.. రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. కానీ ఏం ప్రయోజనం. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అఖిల్ కెరీర్కు ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడింది.
ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా చేసిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలూ నిరాశనే మిగిల్చాయి. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైతేనేం అఖిల్కు అవకాశాలకైతే లోటు లేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో అతను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమా రిలీజై దాని ఫలితాన్ని బట్టి అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం విడుదల కాకముందే అఖిల్ చేతిలోకి క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ అనే భారీ చిత్రం ఖరారైంది. కెరీర్లో ఈ దశలో అంత పెద్ద దర్శకుడితో, భారీ చిత్రం చేసే అవకాశం రావడం ఆశ్చర్యం. ఇప్పుడేమో టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్గా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అఖిల్ సినిమా ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ బేనర్లో ఒక ప్రేమకథా చిత్రం చేయబోతున్నాడట అఖిల్. దర్శకుడెవరన్నది బయటికి రాలేదు కానీ.. స్క్రిప్టు ఓకే అయిందని, సినిమాను త్వరలోనే లాంఛనంగా ప్రకటించబోతున్నారని అంటున్నారు.
ఐతే మూడు డిజాస్టర్లు ఇచ్చినా అఖిల్కు ఇలా క్రేజీ సినిమాలు పడుతున్నాయంటే అది అతడి ఆకర్షణా.. లేక తెరవెనుక నాగ్ మంత్రాంగం వల్లనా అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. చాలామంది రెండో దానికే ఓటేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…