ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల వేషాలుండే పాత్రలు వేయడంలో కమల్ హాసన్ సిద్ధహస్తుడు. మేకప్ విషయంలో ఎంత కష్టపడతాడో, ఎలా అవతారాలు మార్చుకుంటాడో చాలా సినిమాల్లో చూశాం. ఆయన తర్వాత ఆ స్థాయిలో పాత్రల్లో వైవిధ్యం కోసం కష్టపడే నటుడు విక్రమ్. క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా అతను సిద్ధంగా ఉంటాడు.
సేతు సినిమాలో హీరో పాత్రలో నల్లగా కనిపించడం కోసం గంటలు గంటలు ఎండలో నిలబడ్డ కమిట్మెంట్ అతడిది. ఇలా ఎన్నో పాత్రల కోసం ఎంతగానో కష్టపడ్డాడు విక్రమ్. కానీ ఎంత చేస్తున్నా సరే.. గత దశాబ్దంన్నర కాలంలో అతను కోరుకున్న విజయం ఒక్కటీ రాలేదు. పదే పదే మేకప్తో అతను చేసే మ్యాజిక్స్.. ఒక దశ దాటాక మొహం మొత్తేశాయి. ఇంకొక్కడు అనే సినిమాలో అతడి ప్రయాస చూసి.. ఇక ఇలాంటివి చాలు మహాప్రభో అనేశారు ప్రేక్షకులు. అయినా సరే.. విక్రమ్ మాత్రం మారలేదు.
ప్రస్తుతం విక్రమ్ హీరోగా కోబ్రా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టీజర్ చూస్తే.. విక్రమ్ మళ్లీ వేషాలు మార్చే పాత్రనే చేస్తున్నట్లుగా కనిపించింది. టీజర్ పట్ల ఎక్కువగా వ్యతిరేకతే వ్యక్తమైంది. ఐతే డిమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ లాంటి మంచి థ్రిల్లర్లు తీసిన అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాతోనూ ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడనే అంచనాలున్నాయి.
తాజాగా విక్రమ్ కొత్త లుక్ ఒకటి ఈ సినిమా నుంచి బయటికి వచ్చింది. అందులో ఉన్నది విక్రమ్ అంటే నమ్మడం కష్టం. అంత కొత్తగా ఉన్నాడు. లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు. నల్లగడ్డం, తెల్ల మీసం రింగులు తిరిగి, నెరిసిన జుట్టుతో నడి వయస్కుడిగా విక్రమ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మేకప్ కోసం ఎంత కష్టపడి ఉంటాడో అంచనా వేయొచ్చు. కానీ ఈ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా.. ఎప్పట్లాగే విక్రమ్ కేవలం వేషాలతో మురిపించి మిగతా విషయాల్లో నిరాశకు గురి చేస్తాడా అన్నదే చూడాలి.
This post was last modified on June 14, 2021 12:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…