కోలీవుడ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఈ ఏడాది ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు విజయ్. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తరువాత విజయ్ తెలుగులో సినిమా చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ సినిమాను టేకప్ చేయబోతున్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వంశీ ఫైనల్ డ్రాఫ్ట్ ను రెడీ చేయడంతో పాటు క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమాకి అరవై నుండి ఎనభై కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకునే విజయ్ ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
రూ.100 కోట్లు రెమ్యునరేషన్ అడగ్గా.. దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ పారితోషికమే వంద కోట్లు అంటే ఇక మొత్తం సినిమా బడ్జెట్ ఎలా లేదన్నా రూ.200 కోట్లు దాటేయడం ఖాయం. నిజానికి సౌత్ లో ఏ హీరోకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ రావడంతో.. ఆయనకి మాత్రమే రూ.100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు విజయ్ కూడా అదే రేంజ్ లో అందుకోవడం విశేషం.
This post was last modified on June 14, 2021 12:10 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…