గత నెలలోనే రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రాధె. అసలు కొత్త సినిమాల రిలీజే లేని టైంలో సల్మాన్ ఖాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అనేసరికి జనాలు తొలి రోజు బాగానే ఎగబడ్డారు. ఏకంగా టికెట్ రేటు రూ.249 పెట్టడంతో బాగానే సొమ్ము చేసుకున్నారు. కానీ ఆ డబ్బులకు ఏమాత్రం న్యాయం చేసేలా ఆ సినిమా లేకపోయింది.
సామాన్య ప్రేక్షకుల సంగతలా ఉంచితే.. సల్మాన్ ఫ్యాన్స్ సైతం ఆ సినిమా చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంత రొడ్డకొట్టుడు సినిమా తీశాడేంటి అని ప్రభుదేవాను తిట్టుకున్నారు. ఈ చిత్రానికి ఐఎండీబీలో బ్యాడ్ రేటింగ్ వచ్చింది. సల్మాన్ కెరీర్లోనే అతి తక్కువ రేటింగ్ వచ్చింది ఈ చిత్రానికే. ఐతే జీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నపుడే.. థియేటర్లు తెరుచుకున్నాక పెద్ద తెరలోనూ ఈ సినిమా రిలీజవుతుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు.
ఇటీవలే మహారాష్ట్రలో లాక్ డౌన్ షరతులు తొలగిపోయి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభం కావడం తెలిసిందే. కానీ అవి నామమాత్రంగా నడుస్తున్నాయి. జనాలు థియేటర్లకు ఇప్పుడే వచ్చే పరిస్థితి లేదు. నడిపించడానికి చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. ఐతే ముంబయిలోని రెండు థియేటర్లలో రాధె సినిమాను రిలీజ్ చేసి చూశారు దాని యజమానులు. ఎంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినప్పటికీ.. సల్మాన్ హీరోగా చేసిన భారీ చిత్రం కావడంతో ఈ సూపర్ స్టార్ను చూడటానికైనా అభిమానులు ఓ మోస్తరుగా వస్తారని అంచనా వేశారు.
కానీ తొలి రోజు మొత్తంలో ఈ సినిమాకు కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వాటి ద్వారా రూ.6 వేల పైచిలుకు ఆదాయం మాత్రమే వచ్చింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మరీ ఇంత తక్కువ వసూళ్లు రావడమంటే ఇది సల్మాన్ సినిమాకు పరాభవమే అని ట్రేడ్ పండిట్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on June 13, 2021 8:58 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…