గత నెలలోనే రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రాధె. అసలు కొత్త సినిమాల రిలీజే లేని టైంలో సల్మాన్ ఖాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అనేసరికి జనాలు తొలి రోజు బాగానే ఎగబడ్డారు. ఏకంగా టికెట్ రేటు రూ.249 పెట్టడంతో బాగానే సొమ్ము చేసుకున్నారు. కానీ ఆ డబ్బులకు ఏమాత్రం న్యాయం చేసేలా ఆ సినిమా లేకపోయింది.
సామాన్య ప్రేక్షకుల సంగతలా ఉంచితే.. సల్మాన్ ఫ్యాన్స్ సైతం ఆ సినిమా చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంత రొడ్డకొట్టుడు సినిమా తీశాడేంటి అని ప్రభుదేవాను తిట్టుకున్నారు. ఈ చిత్రానికి ఐఎండీబీలో బ్యాడ్ రేటింగ్ వచ్చింది. సల్మాన్ కెరీర్లోనే అతి తక్కువ రేటింగ్ వచ్చింది ఈ చిత్రానికే. ఐతే జీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నపుడే.. థియేటర్లు తెరుచుకున్నాక పెద్ద తెరలోనూ ఈ సినిమా రిలీజవుతుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు.
ఇటీవలే మహారాష్ట్రలో లాక్ డౌన్ షరతులు తొలగిపోయి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభం కావడం తెలిసిందే. కానీ అవి నామమాత్రంగా నడుస్తున్నాయి. జనాలు థియేటర్లకు ఇప్పుడే వచ్చే పరిస్థితి లేదు. నడిపించడానికి చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. ఐతే ముంబయిలోని రెండు థియేటర్లలో రాధె సినిమాను రిలీజ్ చేసి చూశారు దాని యజమానులు. ఎంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినప్పటికీ.. సల్మాన్ హీరోగా చేసిన భారీ చిత్రం కావడంతో ఈ సూపర్ స్టార్ను చూడటానికైనా అభిమానులు ఓ మోస్తరుగా వస్తారని అంచనా వేశారు.
కానీ తొలి రోజు మొత్తంలో ఈ సినిమాకు కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వాటి ద్వారా రూ.6 వేల పైచిలుకు ఆదాయం మాత్రమే వచ్చింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మరీ ఇంత తక్కువ వసూళ్లు రావడమంటే ఇది సల్మాన్ సినిమాకు పరాభవమే అని ట్రేడ్ పండిట్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on June 13, 2021 8:58 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…