‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఆ తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుందా’ లాంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలతో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్నారు. అయితే మహేష్ బాబు హీరోగా తీసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అసురన్’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘నారప్ప’ అనే పేరుతో రూపొందిస్తున్నారు.
ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘కర్ణన్’ రీమేక్ ముందుగా ఆయన చేతుల్లోకి వచ్చింది. అలానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ‘కర్ణన్’ రీమేక్ చేయడానికి ఆయన ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి కారణం గీతాఆర్ట్స్ సంస్థ అని తెలుస్తోంది. నిజానికి చాలా రోజుల క్రితం గీతాఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ అడ్డాలకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి అతడిని లాక్ చేసింది.
నిజానికి ‘నారప్ప’ సినిమా కంటే ముందు గీతాఆర్ట్స్ సంస్థలో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయాలి. కానీ వారు పర్మిషన్ ఇవ్వడంతో బయట బ్యానర్ లో సినిమా చేశారు. ఈసారి మాత్రం తమ బ్యానర్ లోనే సినిమా చేయాలని గీతాఆర్ట్స్ డిమాండ్ చేస్తోందట. దీంతో శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆప్షన్ లేక ‘కర్ణన్’ రీమేక్ ను పక్కన పెట్టారని సమాచారం. ఇప్పుడు ఈ రీమేక్ కోసం దర్శకుడు వినాయక్ కు సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
This post was last modified on June 12, 2021 6:54 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…