‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఆ తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుందా’ లాంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలతో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్నారు. అయితే మహేష్ బాబు హీరోగా తీసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అసురన్’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘నారప్ప’ అనే పేరుతో రూపొందిస్తున్నారు.
ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘కర్ణన్’ రీమేక్ ముందుగా ఆయన చేతుల్లోకి వచ్చింది. అలానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ‘కర్ణన్’ రీమేక్ చేయడానికి ఆయన ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి కారణం గీతాఆర్ట్స్ సంస్థ అని తెలుస్తోంది. నిజానికి చాలా రోజుల క్రితం గీతాఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ అడ్డాలకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి అతడిని లాక్ చేసింది.
నిజానికి ‘నారప్ప’ సినిమా కంటే ముందు గీతాఆర్ట్స్ సంస్థలో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయాలి. కానీ వారు పర్మిషన్ ఇవ్వడంతో బయట బ్యానర్ లో సినిమా చేశారు. ఈసారి మాత్రం తమ బ్యానర్ లోనే సినిమా చేయాలని గీతాఆర్ట్స్ డిమాండ్ చేస్తోందట. దీంతో శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆప్షన్ లేక ‘కర్ణన్’ రీమేక్ ను పక్కన పెట్టారని సమాచారం. ఇప్పుడు ఈ రీమేక్ కోసం దర్శకుడు వినాయక్ కు సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
This post was last modified on June 12, 2021 6:54 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…