బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి.. పన్నెండేళ్ల కిందట వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడటం అప్పట్లో చర్చనీయాంశమే. అప్పటికే రాజ్కు పెళ్లయింది. మొదటి భార్య కవితతో 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నాడతను. వారికో బిడ్డ కూడా పుట్టింది. ఐతే శిల్పాతో పరిచయమయ్యాక ఆమెతో కలిసి ఐపీఎల్ జట్టును నడిపించడం, కొంత కాలానికి ఆమెను పెళ్లాడటం చకచకా జరిగిపోయాయి.
ఐతే మొదటి భార్య నుంచి రాజ్ విడిపోవడానికి కారణం శిల్పానే అని, ఆమె మాయలో పడి కవితకు రాజ్ విడాకులు ఇచ్చాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రచారం కొనసాగుతూనంది. ఐతే ఈ ప్రచారాన్ని రాజ్ ఖండించాడు. తన మొదటి భార్య నుంచి తాను విడాకులు తీసుకోవడానికి శిల్పా ఎంతమాత్రం కారణం కాదన్నాడు. కవితకు తన చెల్లెలి భర్తలో సంబంధం ఉందని తేలడంతోనే తాను విడాకులు తీసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడతను. దీని గురించి అతను వివరంగా మాట్లాడాడు ఇంటర్వ్యూలో.
‘‘అప్పట్లో మేం లండన్లో ఉండేవాళ్లం. నాతో పాటు నా తల్లిదండ్రులు.. నా చెల్లెలు, తన భర్త కూడా ఉండేవాళ్లు. ఐతే కవిత.. నా చెల్లెలి భర్తతో సంబంధం పెట్టుకుంది. నేను వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్తే కవిత ప్రవర్తన మారిపోయేది. నా చెల్లెలి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. ఆఖరికి మా కారు డ్రైవర్ సైతం వాళ్ల గురించి అసభ్యంగా చెప్పాడు. దీంతో మా చెల్లిని, తన భర్తను భారత్కు పంపించేశాం. అయినా సరే కవిత అతడితో మాట్లాడడం మానలేదు. రహస్యంగా ఒక మొబైల్ కొనుగోలు చేసి దాని నుంచి అతనికి తరచూ మెసేజ్లు పంపేది. ఒకసారి ఆ ఫోన్ నా కంటపడింది. అందులో మెసేజ్లు చూసి నా గుండె బద్దలైంది. దీంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అనంతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. నా విడాకులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. నా గురించి శిల్పాకు అన్నీ తెలుసు. అలా, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అని రాజ్ కుంద్రా తెలిపాడు.
This post was last modified on June 12, 2021 2:01 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…