బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి.. పన్నెండేళ్ల కిందట వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడటం అప్పట్లో చర్చనీయాంశమే. అప్పటికే రాజ్కు పెళ్లయింది. మొదటి భార్య కవితతో 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నాడతను. వారికో బిడ్డ కూడా పుట్టింది. ఐతే శిల్పాతో పరిచయమయ్యాక ఆమెతో కలిసి ఐపీఎల్ జట్టును నడిపించడం, కొంత కాలానికి ఆమెను పెళ్లాడటం చకచకా జరిగిపోయాయి.
ఐతే మొదటి భార్య నుంచి రాజ్ విడిపోవడానికి కారణం శిల్పానే అని, ఆమె మాయలో పడి కవితకు రాజ్ విడాకులు ఇచ్చాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రచారం కొనసాగుతూనంది. ఐతే ఈ ప్రచారాన్ని రాజ్ ఖండించాడు. తన మొదటి భార్య నుంచి తాను విడాకులు తీసుకోవడానికి శిల్పా ఎంతమాత్రం కారణం కాదన్నాడు. కవితకు తన చెల్లెలి భర్తలో సంబంధం ఉందని తేలడంతోనే తాను విడాకులు తీసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడతను. దీని గురించి అతను వివరంగా మాట్లాడాడు ఇంటర్వ్యూలో.
‘‘అప్పట్లో మేం లండన్లో ఉండేవాళ్లం. నాతో పాటు నా తల్లిదండ్రులు.. నా చెల్లెలు, తన భర్త కూడా ఉండేవాళ్లు. ఐతే కవిత.. నా చెల్లెలి భర్తతో సంబంధం పెట్టుకుంది. నేను వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్తే కవిత ప్రవర్తన మారిపోయేది. నా చెల్లెలి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. ఆఖరికి మా కారు డ్రైవర్ సైతం వాళ్ల గురించి అసభ్యంగా చెప్పాడు. దీంతో మా చెల్లిని, తన భర్తను భారత్కు పంపించేశాం. అయినా సరే కవిత అతడితో మాట్లాడడం మానలేదు. రహస్యంగా ఒక మొబైల్ కొనుగోలు చేసి దాని నుంచి అతనికి తరచూ మెసేజ్లు పంపేది. ఒకసారి ఆ ఫోన్ నా కంటపడింది. అందులో మెసేజ్లు చూసి నా గుండె బద్దలైంది. దీంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అనంతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. నా విడాకులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. నా గురించి శిల్పాకు అన్నీ తెలుసు. అలా, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అని రాజ్ కుంద్రా తెలిపాడు.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…