Movie News

ఇండియాలో ది బెస్ట్ వెబ్ సిరీస్ అదే

ప్రధాన పాత్రలో ప్రతీక్ గాంధీ అనే పెద్దగా పేరు లేని నటుడు.. దర్శకత్వం వహించిందేమో అంతగా ఫామ్‌లో లేని హన్సల్ మెహతా.. వీరి కలయికలో ‘స్కామ్ 1992’ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి కలగలేదు. రిలీజ్ ముంగిట అసలు హడావుడే లేదు. కానీ గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికే ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్ర్డ్ గేమ్స్ లాంటి వెబ్ సిరీస్‌లు చూసి ఫిదా అయిన భారతీయ ప్రేక్షకులు.. వాటిన్నింటినీ మించిన సిరీస్ ఇదని తీర్పిచ్చారు.

రిలీజ్ తర్వాత అద్భుతమైన రివ్యూలు రావడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎగబడ్డారు. కేవలం ఈ సిరీస్‌ వల్లే ‘సోనీ లైవ్’ సబ్‌స్క్రిప్షన్లు అసాధారణంగా పెరిగాయి. ఆ ఓటీటీకి మంచి పాపులారిటీ లభించింది. సౌత్ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఈ ఓటీటీని సబ్‌స్క్రైబ్ చేసుకుని ‘స్కామ్ 1992’ చూశారు.

ఇప్పటికే ‘ది బెస్ట్’ ఇండియన్ వెబ్ సిరీస్‌గా ప్రేక్షకులతో కితాబులందుకున్న ‘స్కామ్ 1992’ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రేటింగ్ ఇచ్చే ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) గుర్తింపునూ సంపాదించింది. వరల్డ్ వైడ్ అత్యుత్తమ వెబ్ సిరీస్‌ల్లో ‘స్కామ్ 1992’కు ఆల్ టైం 9వ స్థానం దక్కడం విశేషం. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ సంపాదించిన ఇండియన్ వెబ్ సిరీస్ ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 10కి 9.6 రేటింగ్‌తో ఈ సిరీస్ వరల్డ్ వైడ్ టాప్-10లో స్థానం దక్కించుకుంది.

ఈ జాబితాలో ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’, ‘బ్రేకింగ్ బ్యాడ్’, ‘చెర్నోబిల్’ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటిగా 1992లో బయటపడ్డ స్టాక్ మార్కెట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా తేలిన హన్సల్ మెహతా జీవిత కథను ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దిన సిరీస్ ‘స్కామ్ 1992’. దర్శకుడిగా హన్సల్, నటుడిగా ప్రతీక్ అద్భుత పనితనంతో ఈ సిరీస్‌ను మరో స్థాయిలో నిలబెట్టింది.

This post was last modified on June 12, 2021 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

54 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago