ప్రధాన పాత్రలో ప్రతీక్ గాంధీ అనే పెద్దగా పేరు లేని నటుడు.. దర్శకత్వం వహించిందేమో అంతగా ఫామ్లో లేని హన్సల్ మెహతా.. వీరి కలయికలో ‘స్కామ్ 1992’ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి కలగలేదు. రిలీజ్ ముంగిట అసలు హడావుడే లేదు. కానీ గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికే ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్ర్డ్ గేమ్స్ లాంటి వెబ్ సిరీస్లు చూసి ఫిదా అయిన భారతీయ ప్రేక్షకులు.. వాటిన్నింటినీ మించిన సిరీస్ ఇదని తీర్పిచ్చారు.
రిలీజ్ తర్వాత అద్భుతమైన రివ్యూలు రావడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎగబడ్డారు. కేవలం ఈ సిరీస్ వల్లే ‘సోనీ లైవ్’ సబ్స్క్రిప్షన్లు అసాధారణంగా పెరిగాయి. ఆ ఓటీటీకి మంచి పాపులారిటీ లభించింది. సౌత్ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఈ ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకుని ‘స్కామ్ 1992’ చూశారు.
ఇప్పటికే ‘ది బెస్ట్’ ఇండియన్ వెబ్ సిరీస్గా ప్రేక్షకులతో కితాబులందుకున్న ‘స్కామ్ 1992’ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లకు రేటింగ్ ఇచ్చే ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) గుర్తింపునూ సంపాదించింది. వరల్డ్ వైడ్ అత్యుత్తమ వెబ్ సిరీస్ల్లో ‘స్కామ్ 1992’కు ఆల్ టైం 9వ స్థానం దక్కడం విశేషం. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ సంపాదించిన ఇండియన్ వెబ్ సిరీస్ ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 10కి 9.6 రేటింగ్తో ఈ సిరీస్ వరల్డ్ వైడ్ టాప్-10లో స్థానం దక్కించుకుంది.
ఈ జాబితాలో ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’, ‘బ్రేకింగ్ బ్యాడ్’, ‘చెర్నోబిల్’ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటిగా 1992లో బయటపడ్డ స్టాక్ మార్కెట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా తేలిన హన్సల్ మెహతా జీవిత కథను ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దిన సిరీస్ ‘స్కామ్ 1992’. దర్శకుడిగా హన్సల్, నటుడిగా ప్రతీక్ అద్భుత పనితనంతో ఈ సిరీస్ను మరో స్థాయిలో నిలబెట్టింది.
This post was last modified on June 12, 2021 1:43 pm
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…