Movie News

మ‌ళ్లీ మెగాఫోన్ ప‌డుతున్న ఆ లెజెండ్


యండ‌మూరి వీరేంద్ర నాథ్.. తెలుగు వాళ్లు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని అసాధార‌ణ‌ ర‌చ‌యిత‌. తెలుగులో ఆయ‌న్ని మించిన గొప్ప ర‌చ‌యిత‌లు ఉండొచ్చు కానీ.. ఆయ‌న‌లా కొన్ని త‌రాల‌ను ఉర్రూత‌లూగించిన ఎంట‌ర్టైనింగ్ రైట‌ర్ మ‌రొక‌రు లేరు అంటే అతిశ‌యోక్తి కాదు. కేవ‌లం త‌న న‌వ‌ల‌లు, వ్య‌క్తిత్వ వికాస పుస్త‌కాల‌తో సాహితీ ప్రియుల‌నే కాదు.. అద్భుత‌మైన‌ స్క్రిప్టుల‌తోనూ సినీ ప్రేమికుల‌నూ అదే స్థాయిలో అల‌రించిన రైట‌ర్ ఆయ‌న‌.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయ‌న ర‌చ‌న‌లో క్లాసిక్స్, సూప‌ర్ హిట్స్ వ‌చ్చాయి. అభిలాష‌, ఛాలెంజ్, దొంగ‌మొగుడు, రాక్ష‌సుడు, పున్న‌మి నాగు.. ఇలా వీరి క‌ల‌యిక‌లో ఎన్నో మ‌రపురాని సినిమాలు వ‌చ్చాయి. చిరంజీవి సినిమా స్టువ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్‌తోనే యండ‌మూరి మెగా ఫోన్ కూడా ప‌ట్టారు. కాక‌పోతే ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌ళ్లీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం జోలికి వెళ్ల‌లేదు.

సినీ ర‌చ‌యిత‌గా కూడా యండ‌మూరి వైభ‌వం 90వ ద‌శ‌కంలోనే ఆగిపోయింది. ద‌శాబ్దం కింద‌ట వ‌చ్చిన శ‌క్తి సినిమాకు ఆయ‌న క‌థ అందించారు. అది పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో సినిమాల‌కు దూరం అయిపోయారు. ఐతే ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండ‌టం, అది కూడా ద‌ర్శ‌కుడిగా కావ‌డం విశేషం. తాను ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన దొంగ‌మొగుడు సినిమాలో బాగా పాపుల‌ర్ అయిన న‌ల్లంచు తెల్ల‌చీర అనే పాట ప‌ల్ల‌వినే టైటిల్‌గా పెట్టి సినిమా తీస్తున్నారు యండ‌మూరి.

భూష‌ణ్‌, ద‌యా, జెన్ని, కిషోర్ దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. వ‌య‌సు 70కి పైబ‌డ్డ‌ప్ప‌టికీ హుషారుగా క‌నిపించే యండ‌మూరి.. యూత్ ఫుల్ సినిమా తీస్తున్నట్లు చెబుతున్నారు. తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ర‌వి క‌న‌గాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి ఈ వ‌య‌సులో ద‌ర్శ‌కుడిగా యండ‌మూరి ఏమాత్రం స‌త్తా చాటుతారో చూడాలి.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago