కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి గత కొన్ని రోజుల్లో బాగానే తగ్గినప్పటికీ.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. సినీ రంగానికి సంబంధించినంత వరకు ఇప్పుడిప్పుడే యాక్టివిటీ మొదవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. షూటింగ్స్ ఇంకో నెల రోజుల తర్వాత కానీ మొదలుకావనే అంచనాతో ఉన్నారు నిర్మాతలు. జులైలో షూటింగ్స్ కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్లో అయితే షూటింగ్ గురించి టాలీవుడ్ హీరోలెవరూ ఆలోచించే స్థితిలో లేరనే అనుకుంటున్నారు.
కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం సాహసానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అతను ఈ నెలలోనే తిరిగి సెట్లోకి అడుగు పెడతున్నాడట. మొదలైనట్లే మొదలై ఆగిపోయిన ఆదిపురుష్ షూటింగ్ను ఈ నెల 20 తర్వాత ప్రభాస్ పునఃప్రారంభించనున్నాడట. ఈ దిశగా సన్నాహాలు కూడా మొదలైనట్లు సమాచారం.
ముంబయిలోని ఒక సెట్ను పునర్నిర్మించే పనులు ప్రస్తుతం జరుగతున్నాయని.. అక్కడే ఆదిపురుష్ షూటింగ్ పునఃప్రారంభం కానుందని తాజా సమాచారం. అక్కడ ఓ షెడ్యూల్ ముగించుకుని, ఆ తర్వాత చిత్ర బృందం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వస్తుందట. అక్కడ ఓ సుదీర్ఘ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.
ఆదిపురుష్ షూటింగ్ మొదలు పెడుతున్న సమయంలోనే ఈ సినిమా కోసం సిద్ధం చేసిన సెట్లో అగ్ని ప్రమాదం జరగడం తెలిసిందే. దాని వల్ల అంతరాయం కలగ్గా.. తర్వాత కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిన నేపథ్యంలో కొత్త షెడ్యూల్ను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ముంబయిలో కరోనా ప్రభావం బాగా తగ్గడంతో చిత్ర బృందం ధైర్యం చేస్తోంది. బహుశా మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ పునఃప్రారంభించుకోనున్న పేరున్న సినిమా ఆదిపురుష్యే అయ్యే ఛాన్సుంది.
This post was last modified on June 12, 2021 9:13 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…