కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళీ హీరోలు ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు నటించిన సినిమాలను ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా ఈ ఇద్దరు హీరోలకు తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.
ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో ‘మాలిక్’, పృథ్వీరాజ్ హీరోగా ‘కోల్డ్ కేస్’ అనే రెండు సినిమాలను నిర్మించారు యాంటో జోసెఫ్. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కేరళలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో చాలా రోజులుగా అక్కడ లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సినిమాకు ఫైనాన్స్ తీసుకొచ్చిన నిర్మాత ఇప్పటికీ వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో నిర్మాత జోసెఫ్ ఈ రెండు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో క్లారిటీ లేకపోవడం.. ఒకవేళ తెరుచుకున్నా కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతో ఉండే అవకాశాలు ఉండడంతో నిర్మాతలంతా ఓటీటీలతో డీల్ చేసుకుంటున్నారు. అందుకే జోసెఫ్ కూడా ఇదే రూట్ లో వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ లకు మలయాళంలో మంచి క్రేజ్ ఉండడంతో ఈ రెండు సినిమాలకు అమెజాన్ సంస్థ భారీ డీల్ ఆఫర్ చేసిందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.
This post was last modified on June 13, 2021 4:27 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…