సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు తన కెరీర్ లో క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ స్టోరీలతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వర్మ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా ఏ సినిమా రాలేదు. తక్కువ బడ్జెట్ లో చిత్రవిచిత్రమైన కథలతో నాసిరకం సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ విషయంలో వర్మపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘డి కంపెనీ’ సినిమాను స్పార్క్ ఓటీటీలో విడుదల చేశారు.
మాఫియా, గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు వర్మ. ఇదిలా ఉండగా.. వర్మ తొలిసారి కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు..? సినిమా ఎప్పుడు పట్టాలెక్కుంతుందనే విషయాలను మాత్రం చెప్పలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే జోనర్ లో కొన్ని సినిమాలను రూపొందిస్తున్నారు. మరి వర్మ కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉంటుందో చూడాలి. ఇదే ఇంటర్వ్యూలో వర్మను తన ఫ్యామిలీ గురించి ప్రశ్నించగా.. చాలా ఏళ్ల క్రితమే తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని.. తనకు నచ్చింది చేసుకోమని వదిలేశారని చెప్పారు. తన కూతురైతే ‘జూ’లో ఉండే ఒక వింత జీవిని చూసినట్లు చూస్తుందని వర్మ చెప్పుకొచ్చారు.
This post was last modified on June 10, 2021 5:26 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…