సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు తన కెరీర్ లో క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ స్టోరీలతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వర్మ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా ఏ సినిమా రాలేదు. తక్కువ బడ్జెట్ లో చిత్రవిచిత్రమైన కథలతో నాసిరకం సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ విషయంలో వర్మపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘డి కంపెనీ’ సినిమాను స్పార్క్ ఓటీటీలో విడుదల చేశారు.
మాఫియా, గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు వర్మ. ఇదిలా ఉండగా.. వర్మ తొలిసారి కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు..? సినిమా ఎప్పుడు పట్టాలెక్కుంతుందనే విషయాలను మాత్రం చెప్పలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే జోనర్ లో కొన్ని సినిమాలను రూపొందిస్తున్నారు. మరి వర్మ కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉంటుందో చూడాలి. ఇదే ఇంటర్వ్యూలో వర్మను తన ఫ్యామిలీ గురించి ప్రశ్నించగా.. చాలా ఏళ్ల క్రితమే తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని.. తనకు నచ్చింది చేసుకోమని వదిలేశారని చెప్పారు. తన కూతురైతే ‘జూ’లో ఉండే ఒక వింత జీవిని చూసినట్లు చూస్తుందని వర్మ చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…