డ‌బ్బుల్లేవు.. ప‌న్ను క‌ట్ట‌లేదు-కంగ‌నా

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్శ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఈ ఏడాది ఇంకా ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌లేద‌ని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. క‌రోనా-లాక్ డౌన్ కార‌ణంగా ఏడాదిగా షూటింగుల్లో పాల్గొన‌లేద‌ని.. దీంతో స‌రిప‌డా డ‌బ్బులు లేక‌పోవ‌డంతో పూర్తి స్థాయిలో ప‌న్ను చెల్లించ‌లేద‌ని ఆమె వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.

“నా ఆదాయంలో 45 శాతం వరకూ నేను పన్ను రూపంలో చెల్లిస్తున్నాను. అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించే నటిని నేను. ఐతే ఏడాదిగా ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక ఇంకా సగం పన్నుని చెల్లించలేకపోయాను. దీంతో అదనపు ఛార్జీలు కట్టాల్సి వ‌స్తోంది. అయినప్పటికీ నేను అందుకు అంగీకరిస్తున్నాను. ఇలా పన్ను చెల్లించడంలో ఆలస్యం చేయడం నా జీవితంలో ఇదే తొలిసారి” అని కంగన వివ‌రించింది.

బాలీవుడ్లో ఎవ‌రేం త‌ప్పు చేసినా నిల‌దీయ‌డ అల‌వాటుగా మార్చుకున్న కంగ‌నా.. తాను ప‌న్ను చెల్లించ‌క‌పోవ‌డంపై ఎవ‌రైనా కూపీ లాగి సామాజిక మాధ్య‌మాల్లో ర‌చ్చ చేస్తారేమో అన్న అనుమానంతోనే ఇలా చేసిన‌ట్లు ఉంది. ఇటీవ‌ల ఆమె మాస్క్ లేకుండా బ‌య‌ట తిర‌గ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. షూటింగుల్లేని ఈ ఏడాది కాలంలో కంగ‌నా బోలెడ‌న్ని వివాదాల్లో జోక్యం చేసుకుంది. ట్విట్ట‌ర్ వేదికగా ఆమె చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మ‌ద్ద‌తుగా, మిగ‌తా పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఆమె చేసిన ట్వీట్లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. చివ‌రికి ఒక ట్వీట్లో శ్రుతి మించిపోవ‌డంతో ట్విట్ట‌ర్ ఆమె అకౌంట్‌ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే.