పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్ల కెరీర్లు డౌన్ అవుతుంటాయి. కొందరికి క్లోజ్ అయిపోతుంటాయి కూడా. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. వివాహం తర్వాత కూడా ఏమాత్రం స్పీడు తగ్గించరు. మరింత పెంచుతారు కూడా. ఈ అరుదైన జాబితాలోకే చేరుతోంది కాజల్ అగర్వాల్. రెండు మూడేళ్ల ముందు ముందు అవకాశాలు తగ్గిపోయి కళ్యాణ్ రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన కాజల్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలతో భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.
ఇవి సెట్స్ మీద ఉండగానే, గత ఏడాది కరోనా బ్రేక్లో ఆమె పెళ్లి చేసుకుంది. ముందు ఒప్పుకున్న సినిమాలు కాబట్టి పెళ్లి తర్వాత కాజల్ వాటిని పూర్తి చేసి వ్యక్తిగత జీవితంలో సెటిలైపోతుందేమో అనుకున్నారు. కానీ ఆమె మాత్రం వివాహానంతరం క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
ఇప్పటికే నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైన కాజల్.. ఇటీవలే ‘ఉమ’ అనే పాన్ ఇండియా సినిమాలో లీడ్ రోల్కు ఖరారైంది. తాజాగా ఆమె చేతిలోకి మరో క్రేజీ బాలీవుడ్ మూవీ వచ్చింది. తమిళం, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’కి హిందీలో రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ ఇందులో లీడ్ రోల్ చేయనున్నాడు. ఈ చిత్రానికి కాజల్ కథానాయికగా ఎంపికైంది. అజయ్తో ఇంతకుముందే ఆమె ‘సింగం’ సినిమాలో నటించింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. మళ్లీ ‘ఖైదీ’ రీమేక్లో అజయ్, కాజల్ జోడీని చూడబోతున్నాం.
ఐతే ‘ఖైదీ’లో హీరోయిన్ పాత్రే కనిపించదు. హీరో భార్య చనిపోయినట్లు మాటల్లో చెబుతారే కానీ.. ఆ పాత్ర తెరపై కనిపించదు. దాన్ని ‘ఖైదీ’ సీక్వెల్లో చూపించే స్కోప్ మాత్రం కనిపించింది. మరి ఒరిజినల్లో అస్సలు ఒక్క సీన్ కూడా లేని పాత్రను కాజల్ ఎలా ఒప్పుకుందన్నది సందేహం. ఐతే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటపుడు హిందీలో మార్పులు చేర్పులు చాలా జరుగుతుంటాయి. బహుశా హీరోయిన్ పాత్రతో ఒక ఫ్లాష్ బ్యాక్ను నడిపించబోతున్నారేమో. ఈ క్రమంలోనే కాజల్కు ఆ పాత్రను ఆఫర్ చేసినట్లు భావించొచ్చు.
This post was last modified on June 9, 2021 3:18 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…