తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ప్రస్తావన వస్తే తప్పకుండా తలుచుకోవాల్సిన పేర్లలో ఈవీవీ సత్యనారాయణ ఒకటి. తన గురువు జంధ్యాల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సినిమాకు కావాల్సినంత కామెడీ డోస్ ఎక్కించిన ఘనత ఆయన సొంతం. ప్రపంచంలో మరే సినీ పరిశ్రమలో లేని విధంగా టాలీవుడ్లో మాత్రమే ఒకే సమయంలో బోలెడంత మంది కమెడియన్లు మనగలిగారంటే.. వాళ్లందరికీ చేతి నిండా అవకాశాలు వచ్చాయంటే అందుకు ఈవీవీనే కారణం.
తన ప్రతి సినిమాలోనూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లను పెట్టి వాళ్లందరికీ మంచి పాత్రలిచ్చి ఆద్యంతం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవారాయన. మంచి ఫాంలో ఉండగా, తక్కువ వయసులోనే ఆయన గుండెపోటుతో హఠాన్మరణం పాలవడం తెలుగు ప్రేక్షకులకు తీరని లోటే. ఇప్పుడు టీవీలో ఆయన సినిమా వస్తుంటే.. ఆయన లేని లోటును ఫీలవుతూనే ఉంటారు.
ఈ దిగ్గజ దర్శకుడికి జూన్ 10న 66వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేకంగా నివాళి అర్పించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్గా మారిన స్పేసెస్లోకి ఈవీవీ కాన్సెప్ట్ను తీసుకొస్తున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. #Evvteluguspace పేరుతో బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ స్పేస్ నడవనుంది.
ఈవీవీ తనయుడు అల్లరి నరేష్తో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి, గోపీచంద్ మలినేని, కళ్యాణ్ కృష్ణ కురసాల.. రచయిత బీవీఎస్ రవి, లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ తదితరులు ఈ స్పేస్లో పాల్గొనబోతున్నారు. వీళ్లలా చాలామంది ఈవీవీ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్లే. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లే. కాబట్టి ఈ స్పేస్ ఎంతో ఆసక్తికరంగా సాగే అవకాశముంది. నరేష్ సైతం తన తండ్రి గురించి ఎన్నో అనుభవాలు పంచుకునే ఛాన్సుంది. కాబట్టి ఈవీవీ అభిమానులు తప్పక ఫాలో అవ్వాల్సిన స్పేసే ఇది.
This post was last modified on June 9, 2021 11:00 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…