తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ప్రస్తావన వస్తే తప్పకుండా తలుచుకోవాల్సిన పేర్లలో ఈవీవీ సత్యనారాయణ ఒకటి. తన గురువు జంధ్యాల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సినిమాకు కావాల్సినంత కామెడీ డోస్ ఎక్కించిన ఘనత ఆయన సొంతం. ప్రపంచంలో మరే సినీ పరిశ్రమలో లేని విధంగా టాలీవుడ్లో మాత్రమే ఒకే సమయంలో బోలెడంత మంది కమెడియన్లు మనగలిగారంటే.. వాళ్లందరికీ చేతి నిండా అవకాశాలు వచ్చాయంటే అందుకు ఈవీవీనే కారణం.
తన ప్రతి సినిమాలోనూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లను పెట్టి వాళ్లందరికీ మంచి పాత్రలిచ్చి ఆద్యంతం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవారాయన. మంచి ఫాంలో ఉండగా, తక్కువ వయసులోనే ఆయన గుండెపోటుతో హఠాన్మరణం పాలవడం తెలుగు ప్రేక్షకులకు తీరని లోటే. ఇప్పుడు టీవీలో ఆయన సినిమా వస్తుంటే.. ఆయన లేని లోటును ఫీలవుతూనే ఉంటారు.
ఈ దిగ్గజ దర్శకుడికి జూన్ 10న 66వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేకంగా నివాళి అర్పించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్గా మారిన స్పేసెస్లోకి ఈవీవీ కాన్సెప్ట్ను తీసుకొస్తున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. #Evvteluguspace పేరుతో బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ స్పేస్ నడవనుంది.
ఈవీవీ తనయుడు అల్లరి నరేష్తో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి, గోపీచంద్ మలినేని, కళ్యాణ్ కృష్ణ కురసాల.. రచయిత బీవీఎస్ రవి, లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ తదితరులు ఈ స్పేస్లో పాల్గొనబోతున్నారు. వీళ్లలా చాలామంది ఈవీవీ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్లే. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లే. కాబట్టి ఈ స్పేస్ ఎంతో ఆసక్తికరంగా సాగే అవకాశముంది. నరేష్ సైతం తన తండ్రి గురించి ఎన్నో అనుభవాలు పంచుకునే ఛాన్సుంది. కాబట్టి ఈవీవీ అభిమానులు తప్పక ఫాలో అవ్వాల్సిన స్పేసే ఇది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…