దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి రెండో దశ.. ఇప్పుడిప్పుడే కొంచెం సద్దుమణుగుతోంది. ఒక దశలో 4 లక్షల మార్కును కూడా దాటేసిన రోజువారీ మరణాలు ఇప్పుడు లక్షకు చేరువగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అయ్యాయి. అత్యవసర కేసులు తగ్గుముఖం పట్టాయి. జనాల్లో ఆందోళన కొంచెం తగ్గింది. గత ఏడాది మాదిరే కరోనా కర్వ్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. మొత్తానికి సెకండ్ వేవ్ నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతున్నట్లే ఉంది.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో కేసులు, మరణాలు తగ్గడంతో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 10 తర్వాత ఇక్కడ లాక్ డౌన్ ఎత్తేయొచ్చని కూడా అంటున్నారు. ఒకవేళ పొడిగించినా ఇంకో పది రోజులే ఉండొచ్చు. షరతులు ఇంకొంచెం సులభతరం చేయొచ్చు.
ఎటొచ్చీ ఈ నెలాఖర్లోపే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పున:ప్రారంభం దిశగానూ సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్లందరూ కూడా సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు ఇప్పటికే తమ చిత్ర బృందాలకు షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకోమని చెప్పేశారట. కరోనా బారిన పడి కోలుకున్న వీళ్లిద్దరూ.. మళ్లీ కొంచెం కసరత్తులు చేసి ఫిట్గా మారే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
పవన్ ముందుగా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ పని మొదలుపెడతాడట. బన్నీ ‘పుష్ప’ మోడ్లోకి వెళ్లబోతున్నాడు. మరోవైపు మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కూడా మరి కొన్ని వారాల్లో మొదలైపోతుందట. ఆ చిత్ర బృందం కూడా కొత్త షెడ్యూల్ ప్రణాళికల్లో ఉంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు సంబంధించి మిగిలిన పది రోజుల పని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. మిగతా సినిమాల బృందాలు సైతం షూటింగ్కు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఐతే ఎవ్వరూ కూడా ఇప్పుడిప్పుడే ఔట్డోర్ వెళ్లకుండా హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సెట్టింగ్స్లో షూటింగ్ జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
This post was last modified on June 9, 2021 6:34 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…