Movie News

ప్రిపరేషన్ మోడ్‌లో టాలీవుడ్ స్టార్స్

దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి రెండో దశ.. ఇప్పుడిప్పుడే కొంచెం సద్దుమణుగుతోంది. ఒక దశలో 4 లక్షల మార్కును కూడా దాటేసిన రోజువారీ మరణాలు ఇప్పుడు లక్షకు చేరువగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అయ్యాయి. అత్యవసర కేసులు తగ్గుముఖం పట్టాయి. జనాల్లో ఆందోళన కొంచెం తగ్గింది. గత ఏడాది మాదిరే కరోనా కర్వ్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. మొత్తానికి సెకండ్ వేవ్ నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతున్నట్లే ఉంది.

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కేసులు, మరణాలు తగ్గడంతో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 10 తర్వాత ఇక్కడ లాక్ డౌన్ ఎత్తేయొచ్చని కూడా అంటున్నారు. ఒకవేళ పొడిగించినా ఇంకో పది రోజులే ఉండొచ్చు. షరతులు ఇంకొంచెం సులభతరం చేయొచ్చు.

ఎటొచ్చీ ఈ నెలాఖర్లోపే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పున:ప్రారంభం దిశగానూ సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్లందరూ కూడా సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు ఇప్పటికే తమ చిత్ర బృందాలకు షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకోమని చెప్పేశారట. కరోనా బారిన పడి కోలుకున్న వీళ్లిద్దరూ.. మళ్లీ కొంచెం కసరత్తులు చేసి ఫిట్‌గా మారే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

పవన్ ముందుగా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ పని మొదలుపెడతాడట. బన్నీ ‘పుష్ప’ మోడ్‌లోకి వెళ్లబోతున్నాడు. మరోవైపు మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కూడా మరి కొన్ని వారాల్లో మొదలైపోతుందట. ఆ చిత్ర బృందం కూడా కొత్త షెడ్యూల్ ప్రణాళికల్లో ఉంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు సంబంధించి మిగిలిన పది రోజుల పని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. మిగతా సినిమాల బృందాలు సైతం షూటింగ్‌కు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఐతే ఎవ్వరూ కూడా ఇప్పుడిప్పుడే ఔట్‌డోర్ వెళ్లకుండా హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సెట్టింగ్స్‌లో షూటింగ్ జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

This post was last modified on June 9, 2021 6:34 pm

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

31 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago