‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు సానా. ఈ సినిమా యాభై కోట్ల మైలు రాయిని అందుకుంది. దీంతో బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాను నిర్మించిన మైత్రి సంస్థ బుచ్చిబాబుతో మరో సినిమా ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా సినిమా అనుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు బుచ్చిబాబు.. అల్లు అర్జున్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా బుచ్చిబాబు.. అల్లు కాంపౌండ్ లో కనిపించారు. బన్నీతో కథా చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ కాంబినేషన్ ను కూడా మైత్రి మూవీస్ సంస్థే తెరపైకి తీసుకొచ్చిందని టాక్. అంటే ఎన్టీఆర్ కి బదులుగా బన్నీతో చేయాలనుకుంటున్నారా..? లేక బన్నీ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేసుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీన్ని బట్టి ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.
అందుకే బుచ్చిబాబు ఇతర హీరోల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీను కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘పుష్ప’ తరువాత బన్నీ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా మంది దర్శకులు బన్నీను కలిసి కథలు వినిపిస్తున్నారు. అలానే బుచ్చిబాబు కూడా ఓ లైన్ చెప్పడానికి వెళ్లారట. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో బోయపాటి శ్రీను, వేణుశ్రీరామ్ లాంటి దర్శకులు ఉన్నాయి. ఇప్పుడు అదే లిస్ట్ లో బుచ్చిబాబు కూడా చేరారు. మరి వీరందరిలో బన్నీ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి!
This post was last modified on June 8, 2021 5:35 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…