‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు సానా. ఈ సినిమా యాభై కోట్ల మైలు రాయిని అందుకుంది. దీంతో బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాను నిర్మించిన మైత్రి సంస్థ బుచ్చిబాబుతో మరో సినిమా ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా సినిమా అనుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు బుచ్చిబాబు.. అల్లు అర్జున్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా బుచ్చిబాబు.. అల్లు కాంపౌండ్ లో కనిపించారు. బన్నీతో కథా చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ కాంబినేషన్ ను కూడా మైత్రి మూవీస్ సంస్థే తెరపైకి తీసుకొచ్చిందని టాక్. అంటే ఎన్టీఆర్ కి బదులుగా బన్నీతో చేయాలనుకుంటున్నారా..? లేక బన్నీ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేసుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీన్ని బట్టి ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.
అందుకే బుచ్చిబాబు ఇతర హీరోల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీను కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘పుష్ప’ తరువాత బన్నీ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా మంది దర్శకులు బన్నీను కలిసి కథలు వినిపిస్తున్నారు. అలానే బుచ్చిబాబు కూడా ఓ లైన్ చెప్పడానికి వెళ్లారట. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో బోయపాటి శ్రీను, వేణుశ్రీరామ్ లాంటి దర్శకులు ఉన్నాయి. ఇప్పుడు అదే లిస్ట్ లో బుచ్చిబాబు కూడా చేరారు. మరి వీరందరిలో బన్నీ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి!
This post was last modified on June 8, 2021 5:35 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…