‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు సానా. ఈ సినిమా యాభై కోట్ల మైలు రాయిని అందుకుంది. దీంతో బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాను నిర్మించిన మైత్రి సంస్థ బుచ్చిబాబుతో మరో సినిమా ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా సినిమా అనుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు బుచ్చిబాబు.. అల్లు అర్జున్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా బుచ్చిబాబు.. అల్లు కాంపౌండ్ లో కనిపించారు. బన్నీతో కథా చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ కాంబినేషన్ ను కూడా మైత్రి మూవీస్ సంస్థే తెరపైకి తీసుకొచ్చిందని టాక్. అంటే ఎన్టీఆర్ కి బదులుగా బన్నీతో చేయాలనుకుంటున్నారా..? లేక బన్నీ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేసుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీన్ని బట్టి ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.
అందుకే బుచ్చిబాబు ఇతర హీరోల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీను కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘పుష్ప’ తరువాత బన్నీ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా మంది దర్శకులు బన్నీను కలిసి కథలు వినిపిస్తున్నారు. అలానే బుచ్చిబాబు కూడా ఓ లైన్ చెప్పడానికి వెళ్లారట. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో బోయపాటి శ్రీను, వేణుశ్రీరామ్ లాంటి దర్శకులు ఉన్నాయి. ఇప్పుడు అదే లిస్ట్ లో బుచ్చిబాబు కూడా చేరారు. మరి వీరందరిలో బన్నీ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి!
This post was last modified on June 8, 2021 5:35 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…