‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు సానా. ఈ సినిమా యాభై కోట్ల మైలు రాయిని అందుకుంది. దీంతో బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాను నిర్మించిన మైత్రి సంస్థ బుచ్చిబాబుతో మరో సినిమా ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా సినిమా అనుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు బుచ్చిబాబు.. అల్లు అర్జున్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా బుచ్చిబాబు.. అల్లు కాంపౌండ్ లో కనిపించారు. బన్నీతో కథా చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ కాంబినేషన్ ను కూడా మైత్రి మూవీస్ సంస్థే తెరపైకి తీసుకొచ్చిందని టాక్. అంటే ఎన్టీఆర్ కి బదులుగా బన్నీతో చేయాలనుకుంటున్నారా..? లేక బన్నీ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేసుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీన్ని బట్టి ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.
అందుకే బుచ్చిబాబు ఇతర హీరోల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీను కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘పుష్ప’ తరువాత బన్నీ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా మంది దర్శకులు బన్నీను కలిసి కథలు వినిపిస్తున్నారు. అలానే బుచ్చిబాబు కూడా ఓ లైన్ చెప్పడానికి వెళ్లారట. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో బోయపాటి శ్రీను, వేణుశ్రీరామ్ లాంటి దర్శకులు ఉన్నాయి. ఇప్పుడు అదే లిస్ట్ లో బుచ్చిబాబు కూడా చేరారు. మరి వీరందరిలో బన్నీ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి!
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…