‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది మెహ్రీన్. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వచ్చాయి. శర్వానంద్, రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో వెండితెరపై రొమాన్స్ చేసింది. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రానప్పటికీ మీడియం రేంజ్ హీరోలతో జత కడుతూ కాస్త క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి సినిమా ఆఫర్లు రావడం లేదు.
ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ 3’ తప్ప మరో తెలుగు సినిమా లేదు. దీంతో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంది. భవ్య బిష్ణోయ్ అనే యంగ్ పొలిటికల్ లీడర్ తో పెళ్లికి రెడీ అయింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కోవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది మెహ్రీన్. ఈ క్రమంలో ఓ కుర్ర హీరోతో కలిసి నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’తో సక్సెస్ అందుకున్న సంతోష్ శోభన్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమా ప్లాన్ చేశారు. ముప్పై రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు మారుతి. లాక్ డౌన్ లో ఈ చిన్న సినిమాకి శ్రీకారం చుట్టారు. సైలెంట్ గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. అతి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ కనిపించనుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు మెహ్రీన్ మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తొలిసారి వయసులో తనకంటే చిన్నవాడైనా సంతోష్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. అవకాశాలు రాకే ఆమె ఈ సినిమా ఒప్పుకొని ఉంటుందని అంటున్నారు. మరి వెండితెరపై ఈ కాంబినేషన్ లో ఎలా ఉంటుందో చూడాలి. మరోపక్క మారుతి.. గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను ప్లాన్ చేశారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభిస్తారు.
This post was last modified on June 8, 2021 11:40 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…