Movie News

‘ప్రతాపరుద్రుడు’లో మహేష్ బాబు?

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎంతో డెడికేషన్ తో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అందుకే స్టార్ హీరోలు కూడా ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమా తరువాత గుణశేఖర్ మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. రానా ప్రధాన పాత్రలో ‘హిరణ్యకశ్యప’ చేయాలనుకున్నారు. కానీ దానికంటే ముందుగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా తరువాత ‘హిరణ్యకశ్యప’ పూర్తి చేస్తానని ఇటీవల గుణశేఖర్ వెల్లడించారు. అయితే దీంతో పాటు అతడి దగ్గర ‘ప్రతాపరుద్రుడు’ కథ సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఓ స్టార్ హీరోతో తీయాలనేది ఆయన ఆలోచన. ముందుగా ఈ కథను మహేష్ బాబుకి వినిపించాలని అనుకుంటున్నారు గుణశేఖర్. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలు చేశారు. ఈ మూడు చిత్రాల్లో ‘ఒక్కడు’ మాత్రం హిట్ అయింది. మిగిలిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. అయినప్పటికీ మహేష్ బాబు.. గుణశేఖర్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు.

నిజానికి ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ ని అడిగారు. ఆయన కూడా అంగీకరించారు కానీ ఆఖరి నిమిషాల్లో డేట్స్ కుదరక తప్పుకున్నారు. దీంతో భవిష్యత్తులో కచ్చితంగా సినిమా చేద్దామని మహేష్ మాటిచ్చారట. అందుకే గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథను మహేష్ తో తీయాలనుకుంటున్నారు. పైగా ఇప్పటివరకు మహేష్ ని ఈ తరహా పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మహేష్ గనుక ఒప్పుకోకపోతే ఆ కథను కూడా రానాతోనే చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

This post was last modified on June 8, 2021 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

1 hour ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago