Movie News

‘ప్రతాపరుద్రుడు’లో మహేష్ బాబు?

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎంతో డెడికేషన్ తో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అందుకే స్టార్ హీరోలు కూడా ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమా తరువాత గుణశేఖర్ మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. రానా ప్రధాన పాత్రలో ‘హిరణ్యకశ్యప’ చేయాలనుకున్నారు. కానీ దానికంటే ముందుగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా తరువాత ‘హిరణ్యకశ్యప’ పూర్తి చేస్తానని ఇటీవల గుణశేఖర్ వెల్లడించారు. అయితే దీంతో పాటు అతడి దగ్గర ‘ప్రతాపరుద్రుడు’ కథ సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఓ స్టార్ హీరోతో తీయాలనేది ఆయన ఆలోచన. ముందుగా ఈ కథను మహేష్ బాబుకి వినిపించాలని అనుకుంటున్నారు గుణశేఖర్. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలు చేశారు. ఈ మూడు చిత్రాల్లో ‘ఒక్కడు’ మాత్రం హిట్ అయింది. మిగిలిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. అయినప్పటికీ మహేష్ బాబు.. గుణశేఖర్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు.

నిజానికి ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ ని అడిగారు. ఆయన కూడా అంగీకరించారు కానీ ఆఖరి నిమిషాల్లో డేట్స్ కుదరక తప్పుకున్నారు. దీంతో భవిష్యత్తులో కచ్చితంగా సినిమా చేద్దామని మహేష్ మాటిచ్చారట. అందుకే గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథను మహేష్ తో తీయాలనుకుంటున్నారు. పైగా ఇప్పటివరకు మహేష్ ని ఈ తరహా పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మహేష్ గనుక ఒప్పుకోకపోతే ఆ కథను కూడా రానాతోనే చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

This post was last modified on June 8, 2021 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

1 hour ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

2 hours ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

5 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

6 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

9 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

10 hours ago