సినీ మహాకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఏళ్లుగా తన సాహిత్యంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ తరం వాళ్లను కూడా ఆయన తన పాటలతో అల్లుకుపోతున్నారు. ‘జాను’ సినిమాలో ఆయన రాసిన ‘లైఫ్ ఆఫ్ రామ్’ పాట శ్రోతలను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇలాంటి పాటలు ఆయన కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. పాటల ప్రపంచంలోనే గడిపే సిరివెన్నెల గతేడాది ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది కావొస్తున్న సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ముందుగా ఓ నెటిజన్ ‘అప్పట్లో ఉన్న పాటలు సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు గురువు గారు?’ అని ప్రశ్నించగా.. దానికి సిరివెన్నెల.. ‘ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్నిరకాలుగానూ, ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం’ అంటూ బదులిచ్చారు.
మరో నెటిజన్ ‘త్రివిక్రమ్ గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం ఏంటి గురువు గారూ…?’ అని ప్రశ్నించారు. వెంటనే సిరివెన్నెల ‘మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు’ అంటూ చెప్పుకొచ్చారు. తనకు బాగా నచ్చే పుస్తకం.. ఒకటి- భగవద్గీత, రెండు- ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫిట్’ అని చెప్పారు. తనకు బాగా నచ్చే కవి ‘వాల్మీకి’ అని తెలిపారు. ఇన్నేళ్ల తన సాహిత్య ప్రయాణంలో ప్రయోగించిన, గర్వించదగ్గ పదం లేదా వాక్యంపై స్పందిస్తూ.. ”ప్రశ్న – కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న” అంటూ చెప్పుకొచ్చారు.
This post was last modified on June 6, 2021 2:34 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…