సినీ మహాకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఏళ్లుగా తన సాహిత్యంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ తరం వాళ్లను కూడా ఆయన తన పాటలతో అల్లుకుపోతున్నారు. ‘జాను’ సినిమాలో ఆయన రాసిన ‘లైఫ్ ఆఫ్ రామ్’ పాట శ్రోతలను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇలాంటి పాటలు ఆయన కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. పాటల ప్రపంచంలోనే గడిపే సిరివెన్నెల గతేడాది ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది కావొస్తున్న సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ముందుగా ఓ నెటిజన్ ‘అప్పట్లో ఉన్న పాటలు సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు గురువు గారు?’ అని ప్రశ్నించగా.. దానికి సిరివెన్నెల.. ‘ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్నిరకాలుగానూ, ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం’ అంటూ బదులిచ్చారు.
మరో నెటిజన్ ‘త్రివిక్రమ్ గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం ఏంటి గురువు గారూ…?’ అని ప్రశ్నించారు. వెంటనే సిరివెన్నెల ‘మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు’ అంటూ చెప్పుకొచ్చారు. తనకు బాగా నచ్చే పుస్తకం.. ఒకటి- భగవద్గీత, రెండు- ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫిట్’ అని చెప్పారు. తనకు బాగా నచ్చే కవి ‘వాల్మీకి’ అని తెలిపారు. ఇన్నేళ్ల తన సాహిత్య ప్రయాణంలో ప్రయోగించిన, గర్వించదగ్గ పదం లేదా వాక్యంపై స్పందిస్తూ.. ”ప్రశ్న – కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న” అంటూ చెప్పుకొచ్చారు.
This post was last modified on June 6, 2021 2:34 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…