Movie News

కీర్తి సురేష్ సినిమా.. పత్తా లేకుండా పోయిందే!

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి అంగీకరించింది కీర్తి సురేష్. లాక్ డౌన్ సమయంలో ఆమె నటించిన ‘పెంగ్విన్’,’మిస్ ఇండియా’ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. రెండూ డిజాస్టర్లుగా తేలిపోయాయి.

ఇదిలా ఉండగా.. కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలం అవుతోంది. గతేడాది లాక్ డౌన్ లోనే రిలీజ్ ఉంటుందని హడావిడి చేశారు. కానీ ఏడాది గడిచిపోయింది. రెండు నెలల క్రితం సినిమాను జూన్ 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలా జరగలేదు. లాక్ డౌన్ కారణంగా మళ్లీ సినిమాను వాయిదా వేసినట్లు ఉన్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై మరో అప్డేట్ రాలేదు.

ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. గతంలో కీర్తి నటించిన సినిమాలు ఓటీటీలో వర్కవుట్ అవ్వకపోవడంతో.. ఈసారి నిర్మాతలు జంకుతున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో ‘హైదరాబాద్ బ్లూస్’, ‘తీన్ దీవారే’, ‘ఇక్బల్’ వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన నగేష్ కుకునూర్ తీసిన సినిమా కావడంతో దీనిపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఒక పల్లెటూరి అల్లరి పిల్ల రైఫిల్ షూటర్ గా ఎలా ఉన్నత శిఖరాలకు చేరుకుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి నటులు ముఖ్యపాత్రలు పోషించారు.

This post was last modified on June 6, 2021 7:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago