సరైన సినిమా పడితే.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల కెరీర్లు ఎలా మారిపోతాయనడానికి బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలే ఉదాహరణ. ‘బాహుబలి’ అయినా అప్పటికే గొప్ప పేరున్న రాజమౌళి తీసింది. కానీ ‘కేజీఎఫ్’ సినిమాను తెరకెక్కించింది మాత్రం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్. ‘ఉగ్రం’ అనే సూపర్ హిట్ మూవీతో ఈ కన్నడ దర్శకుడు అరంగేట్రం చేశాడు.
ఐతే అది మంచి సినిమానే కానీ.. కన్నడ పరిశ్రమను దాటి ప్రశాంత్ ప్రతిభను బయటి వాళ్లకు పరిచయం చేసే స్థాయి చిత్రమైతే కాదు. కానీ ప్రశాంత్ తీసిన రెండో సినిమా ‘కేజీఎఫ్’ మాత్రం అతడిని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ని చేసింది. ఈ సినిమా చూసి వివిధ భాషల వాళ్లు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులే కాక ఇక్కడి హీరోలు, నిర్మాతలు ప్రశాంత్ పనితీరుకు ముగ్ధులైపోయారు. ఇప్పటికే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్లు అతడితో సినిమాలు ఓకే చేసుకున్నారు. అల్లు అర్జున్ సైతం లైన్లో ఉన్నాడు.
‘కేజీఎఫ్’తో ఇంతగా పేరు సంపాదించిన ప్రశాంత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడితో ‘కేజీఎఫ్’.. ‘సలార్’ చిత్రాలు నిర్మిస్తున్న హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను రూపొందించింది. ‘కేజీఎఫ్’ మేకింగ్ సందర్భంగా ప్రశాంత్ తన టీంతో కలిసి ఎంత ఉత్సాహంగా పని చేస్తున్నాడో చూపించే వీడియో ఇది. కన్నడ నేల నుంచి పుట్టిన ఈ దర్శకుడు.. ‘ది బెస్ట్’ అనిపించుకున్నాడని.. తన టీంలో ప్రతి ఒక్కరి నుంచి ‘ది బెస్ట్’ రాబడతాడని అతడికి ఎలివేషన్ ఇస్తూ ఈ వీడియో సాగింది.
ప్రశాంత్ గురించి ‘కేజీఎఫ్’ హీరో యశ్ చేసిన వ్యాఖ్యలను సైతం దీనికి జోడించారు. ప్రశాంత్ ప్రతిభ విషయంలో ‘కేజీఎఫ్’ ఆరంభం మాత్రమే అని.. అతడి నుంచి ఇంకా చాలా చూడబోతున్నారని.. అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయని యశ్ వ్యాఖ్యానించాడు. ప్రశాంత్ ఒక హాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తే చూడాలని తన కోరిక అని, ఆ సామర్థ్యం అతడికి ఉందని కూడా యశ్ అన్నాడు. ప్రశాంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు బాగా పరిచయం కావడంతో.. అందరూ ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు.
This post was last modified on June 4, 2021 2:13 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…