Movie News

‘లూసిఫర్’లో వరుణ్ తేజ్..?

యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన తరువాత మోహన్ రాజా రూపొందించనున్న ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్నారు. ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు చిరు. అయితే ముందుగా ‘లూసిఫర్’ రీమేక్ ను పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకాగా.. తాజాగా క్యాస్టింగ్ పనులను మొదలుపెట్టారని తెలుస్తోంది.

ఈ క్రమంలో మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న నటులకు కాల్స్ వెళ్లాయి. హీరో వరుణ్ తేజ్ ను కూడా సినిమాలో కీలకపాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మలయాళ వెర్షన్ లో నటుడు టోవినో థామస్ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. విదేశాల నుండి ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే పాత్ర అది. ముందు ఈ రోల్ కోసం విజయ్ దేవరకొండను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని అప్పట్లో విజయ్ క్లారిటీ ఇచ్చారు.

వరుణ్ తేజ్ ని తీసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ కి హైప్ మరింత వస్తుందని భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలకు చిరంజీవితో కలిసి పని చేయాలనేది కోరిక. వరుణ్ తేజ్ కూడా ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. కాబట్టి మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా వదులుకోరని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అలానే మరికొన్ని ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

This post was last modified on June 4, 2021 9:15 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago