యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన తరువాత మోహన్ రాజా రూపొందించనున్న ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్నారు. ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు చిరు. అయితే ముందుగా ‘లూసిఫర్’ రీమేక్ ను పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకాగా.. తాజాగా క్యాస్టింగ్ పనులను మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఈ క్రమంలో మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న నటులకు కాల్స్ వెళ్లాయి. హీరో వరుణ్ తేజ్ ను కూడా సినిమాలో కీలకపాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మలయాళ వెర్షన్ లో నటుడు టోవినో థామస్ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. విదేశాల నుండి ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే పాత్ర అది. ముందు ఈ రోల్ కోసం విజయ్ దేవరకొండను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని అప్పట్లో విజయ్ క్లారిటీ ఇచ్చారు.
వరుణ్ తేజ్ ని తీసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ కి హైప్ మరింత వస్తుందని భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలకు చిరంజీవితో కలిసి పని చేయాలనేది కోరిక. వరుణ్ తేజ్ కూడా ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. కాబట్టి మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా వదులుకోరని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అలానే మరికొన్ని ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…