యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన తరువాత మోహన్ రాజా రూపొందించనున్న ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్నారు. ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు చిరు. అయితే ముందుగా ‘లూసిఫర్’ రీమేక్ ను పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకాగా.. తాజాగా క్యాస్టింగ్ పనులను మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఈ క్రమంలో మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న నటులకు కాల్స్ వెళ్లాయి. హీరో వరుణ్ తేజ్ ను కూడా సినిమాలో కీలకపాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మలయాళ వెర్షన్ లో నటుడు టోవినో థామస్ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. విదేశాల నుండి ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే పాత్ర అది. ముందు ఈ రోల్ కోసం విజయ్ దేవరకొండను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని అప్పట్లో విజయ్ క్లారిటీ ఇచ్చారు.
వరుణ్ తేజ్ ని తీసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ కి హైప్ మరింత వస్తుందని భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలకు చిరంజీవితో కలిసి పని చేయాలనేది కోరిక. వరుణ్ తేజ్ కూడా ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. కాబట్టి మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా వదులుకోరని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అలానే మరికొన్ని ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…