Movie News

పాపం ఆ హీరో ఇంకా ఆ దేశంలోనే..

క‌రోనా కాలంలో ఎవ‌రెన్ని ఇబ్బందులు ప‌డుతున్నా ఫిలిం సెట‌బ్రెటీలు స‌ర‌దా స‌ర‌దా ఛాలెంజ్‌లు విసురుకుంటూ చాలా హ్యాపీగా గ‌డిపేస్తున్నారని అనుకుంటున్నాం కానీ.. వాళ్ల‌లో కూడా ఇబ్బందులు ప‌డుతున్న‌వాళ్లు లేక‌పోలేదు.

అందులో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఒక‌డు. త‌న కొత్త సినిమా షూటింగ్ కోసం అత‌ను మూడు నెల‌ల కింద‌ట జోర్డాన్ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల‌కే క‌రోనా కార‌ణంగా దేశాల మ‌ధ్య ర‌వాణా ఆగిపోయింది. దీంతో పృథ్వీరాజ్ అండ్ టీం జోర్డాన్‌లోనే చిక్కుకుపోయింది.

అక్క‌డ స‌రైన తిండి దొర‌క్క పృథ్వీరాజ్, ఇత‌ర యూనిట్ స‌భ్యులు అవ‌స్థలు ప‌డుతున్న విష‌యం ఇంత‌కుముందే వెల్ల‌డైంది. ఐతే కొన్ని రోజుల‌కు ప‌రిస్థితులు కొంచెం చక్క‌బ‌డి వారికి తిండి, వ‌స‌తి స‌మ‌కూరాయి. ఐతే స్వ‌దేశానికి వ‌ద్దామంటే మాత్రం కుద‌ర‌ట్లేదు.

ఈ నెల తొలి వారం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల్ని ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసి.. వంద‌ల మందిని తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే జోర్డాన్‌కు మాత్రం ప్ర‌త్యేక విమానమేదీ పంపిన‌ట్లు లేదు. దీంతో పృథ్వీరాజ్ అండ్ కో ఇంకా అక్క‌డే ఉంది. త‌న భ‌ర్త‌కు దూర‌మైన పృథ్వీ రాజ్ భార్య తాజాగా సోష‌ల్ మీడియాలో ఒక హృద్య‌మైన పోస్టు పెట్టింది. ఎనిమిదేళ్ల కింద‌ట ఒక సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో పృథ్వీరాజ్ కూర్చుని న‌వ్వులు చిందిస్తున్న ఫొటోను ఆమె షేర్ చేసింది.

మ‌ళ్లీ ఇలా ఎప్పుడు కూర్చుని కబుర్లు చెప్పుకుంటామో తెలియ‌ట్లేద‌న్న పృథ్వీ భార్య‌.. త‌మ జీవితంలో ఇదే అతి పెద్ద ఎడ‌బాటు అని చెప్పింది. త‌న భ‌ర్త‌కు 77 రోజులుగా దూరంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఒక సూపర్ స్టార్ హీరోకు జీవితంలో ఇలాంటి అనుభ‌వం వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు.

This post was last modified on May 16, 2020 11:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago